రాంగ్ బటన్లు నొక్కుతున్న జగన్!


(పెద్దాడ నవీన్ 27-7-2019)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారత ఆర్ధిక వాతావరణంపై అంతర్జాతీయ ద్రవ్యసంస్ధలకు కేంద్రప్రభుత్వం వివరణ ఇచ్చుకోవలసిన పరిస్ధితిని ముందుకి నెడుతున్నారు

తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించాక కూడా చంద్రబాబు మీద పగా ద్వేషాలతో రగిలిపోతున్నట్టున్న జగన్ మాటలుచేతలు పాత ప్రభుత్వ నిర్ణయాలను తిరగదోడటానికి మాత్రమే పరిమితం కాలేదు

రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విశాఖ మెట్రోరైలు నిర్మాణాలకు అప్పు ఇవ్వడానికి ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంకు, ఆసియా బ్యాంకు రుణం ఇవ్వలేమని చెప్పేశాయి.

ఆర్ధిక సంస్కరణలు, ఉదార విధానాలు భారత్ లో 29 ఏళ్ళక్రితం మొదలయ్యాయి. పెట్టుబడులను ప్రోత్సహించే పద్ధతిలో ప్రయివేటు రంగానికి అనేక రాయితీలు ఇవ్వవలసి వుంటుందిఇంకా చెప్పాలంటే గొంతెమ్మ కోర్కెలు అనిపించే ప్రయివేటు షరతులను ప్రభుత్వాలు ఆమోదించక తప్పదు. విధంగా విస్తరించే పరిశ్రమలు సర్వీసురంగం ప్రయోజనాలను రెండోదశలో వినియోగదారులకు అందేలా చూడవలసి వుంటుంది.

భిన్న సంస్కృతులు, ఆర్ధిక స్ధితిగతులు, రాజకీయ వాతావరణాలు వున్న భారత దేశంలో సంస్కరణలు అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే తీరుగా, ఒకే వేగంతో అమలు కావడం లేదు. అయితే సంస్కరణల తత్వాన్ని ముందుగా గ్రహించి వేగంగా అమలు పరచిన ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పట్లోనే ఆర్ధిక, వాణిజ్య రంగాలలో అంతర్జాతీయ, జాతీయ వేదికల మీద (అవిభక్త) ఆంధ్రప్రదేశ్ ను ప్రముఖంగా నిలబెట్టారు. తొలిదశల్లో ఆయన సంక్షేమాన్ని పక్కన పెట్టి సంస్కరణల కు పెద్దపీటవేసి పెట్టుబడిదారుల కొమ్ముకాస్తున్నారని పేరుపడ్డారు

ఆతరువాత వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సంస్కరణలకు సంక్షేమానికి మధ్య సమతూకం తెచ్చారు. “ఆరోగ్యశ్రీపధకం ఆయనకునప్రజానాయకుడిగా దేశంలోనే ప్రఖ్యాతి తెచ్చిపెట్టింది

రెడ్ టేపిజాన్ని, పర్మిట్ల రాజ్యాన్ని తొలగించే సంస్కరణలతో పాటు లంచగొండితనం, బ్రోకర్ల సేవలు, “మీకు అది నాకు ఇది”, అనే ఒప్పందాలు, అవినీతి పెరిగిపోతాయి. ప్రపంచమంతటా ఇదే ధోరణి వుందిఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఒప్పందాలపై చంద్రబాబు నాయుడు, ఓడరేవులు, సెజ్ నోటిఫికేషన్ల వంటి భూముల కేటాయింపులపై వైఎస్ రాజశేఖరరెడ్డి తీవ్రమైన అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నారు. అక్రమ ఆదాయాల కేసుల్లో అప్పటి ముఖ్యమంత్రి కొడుకుగా జగన్, అప్పటి మంత్రి, కొందరు అధికారులు జైలుకి వెళ్ళడం సంస్కరణల్లో అవినీతి పార్శ్వానికి పరాకాష్ట. జగన్ మీద కేసుల విచారణ సాగుతూనే వుంది

నేపధ్యంలోనే ఆంధ్రప్రదేశ్ విభజన, 13 జిల్లాల రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడం, రాజధాని, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం వంటి నిర్మాణ, పునర్మిర్మాణ బాధ్యతల అమలు మొదలయ్యింది. దశలో జరిగిన ఎన్నకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది

ముఖ్యమంత్రిగా జగన్ తన ఎజెండాను అమలు చేయడం కంటే చంద్రబాబు మీద పెంచుకున్న ద్వేషాన్ని ప్రతీకారంగా మార్చుకోడానికే ప్రాధాన్యత ఇస్తున్నట్టు అర్ధమౌతోంది. రాజరికంలో తప్ప ప్రజాస్వామ్యంలో ఇది నడవదు

విద్యుత్తు ఒప్పందాలను తిరగదోడటం , రివర్స్ టెండరింగ్ మొదలైన నిర్ణయాలు  ప్రత్యక్షంగా రాష్ట్రాభివృద్ధిని కుంటుపరచేవిగా పరోక్షంగా జగన్ కాళ్ళ కిందికి నీళ్ళు తెచ్చేవిగా వున్నాయి

రాష్ట్రాల ప్రతిపాదనలు, కేంద్ర సంస్ధల, శాఖల ఆమోదాల తరువాతే ఆంతర్జాతీయ, జాతీయ ద్రవ్య సంస్ధల ఒప్పందాలు జరుగుతాయిప్రతీదశలోనూ పైనుంచి కిందికి ప్రశ్నలు అడగటం, కింద నుంచి వివరణలు ఇవ్వడం జరుగతుంది. ఒకసారి ఆమోదం కుదిరాక దానిని తిరగదోడటం అంటే ప్రాజెక్టు రద్దైపోవడమే

ఇపుడు ఆంధ్రప్రదేశ్ లో మొదలైంది ఇదే

ముందు చూపూ, పర్యావసానాలపై అంచనాలు లేకుండా నిర్ణయాలు తీసుకోవడం ఒక ముఖ్యమంత్రి చేయకూడని పని. ఆయనకు తెలియదు సరే ఆజేయ్ కల్లాం వంటి అనుభవజ్ఞులైన సలహాదారులు , ప్రభుత్వ యంత్రాంగం సలహా ఇవ్వకపోవడం ఆశ్చర్యకరంసలహా ఇచ్చినా జగన్ పట్టించుకోలేదంటే రాష్ట్రం దౌర్భాగ్యం

పరిస్ధితిని రాజకీయకోణం నుంచి చూసినా జగన్ కే నష్టం. మోదీ ప్రభుత్వం తాను నిర్దేశించుకున్న ఆర్ధిక విధానాలతోనే పాలన సాగిస్తుందిఅమిత్ షా సారధ్యంలోని బిజెపి తాను నిర్దేశించుకున్న మార్గంలోనే ప్రత్యర్ధులను తొక్తేస్తూ పార్టీని విస్తరించుకుంటూ పోతుందిఇందులో వ్యక్తిగత ప్రాబల్యాలకూ, ఎమోషన్లకూ, ఇగోలకూ చోటు వుండదు

నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ వంటి సామాజిక న్యాయం విధానాలపట్ల ద్రవ్య సంస్ధలకు అభ్యంతరం వుండదు. పరిశ్రమల్లో 75 శాతం స్ధానికులకు రిజర్వేషన్ విధానాలను ద్రవ్యసంస్ధలు అనుమతించవు. కాదూ కూడదని చట్టం చేస్తే రాష్ట్రంలో పరిశ్రమలకు అప్పు దొరకదు

సంస్కరణలకు వ్యతిరేక దశలో వున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఖరి అంతర్జాతీయ ద్రవ్యసంస్ధలకూ, కేంద్ర ప్రభుత్వానికీ నచ్చదు.. ‬

సంస్కరణలకు అనుకూలంగా చట్టాలను మార్చుకుంటూ వస్తున్న మోదీ ప్రభుత్వం జగన్ దుందుడుకు తనానికి గట్టిగానే చెవిమెలిపెట్టే వాతావరణం కనబడుతోంది. 

సామాజిక న్యాయం, సంకషేమాలతోపాటు సంస్కరణలను కూడా జగన్ భుజాన మోయకపోతే మోదీ ప్రభుత్వానికి ఎపి ప్రభుత్వానికి మధ్య ఆర్ధిక సూత్రబద్ధమైన వైరుధ్యంవారిని ప్రత్యర్ధులగా మార్చే అవకాశం వుంది.

కూల్చివేత…ప్రాధాన్యతా!ప్రతీకారమా! దృష్టిమళ్ళింపా! టైంపాసా! (శనివారం నవీనమ్)


రాష్ట్ర ప్రభుత్వం “ప్రజావేదిక”ను కూల్చివేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వుంటున్న అక్రమ నిర్మాణ నివాసాన్ని కూల్చివేయడాన్ని కూడా తప్పుపట్టవలసిన పని లేదు…

అయితే, రాష్ట్రవ్యాప్తంగా కరకట్టలను ఆక్రమించుకుని నివశిస్తున్న లక్షకు పైగా ఇళ్ళ మాటేమిటి? పోనీ విజయవాడలోనే కరకట్ట మీద వుంటున్న పదిహేను వేల నివాసాల మాటేమిటి? వాటిలో నివశిస్తున్న పేద కుటుంబాలకు పునరావాసం ఎలా అన్న ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం లేదు.

Read more

పిల్లలలో అసంబంధాలు / Unattached Life


పెద్దాడ నవీన్)

20-7-2018

ఇంటికే పరిమితమైన సామాజిక జీవనం…లివింగ్ రూమ్ కే పరిమితమైన

కుటుంబ జీవనం…మమ్మీ, డాడీ – వాళ్ళ తోబుట్టువులను, వారి బాధ్యతలను వొదిలించుకోడానికి చూపించే లౌక్యం, పడే శ్రమ…పైమెట్టు మీద వున్నవారితో పరిచయాలు పెంచుకునే తాపత్రయాలు, సంబంధాలు, స్నేహాలు…

వ్యక్తిత్వ వికాసానికి అమ్మ నాన్నల గైడెన్స్ అవసరమైన టీనేజిలో మనోభావాల్ని, సహజస్పందనల్ని చిదిమేసే బ్రాండ్ (నారాయణ చైతన్య)చదువులు…అవసరానికి మించి యిచ్చే పాకెట్ మనీ…ఏమి తాగాలో ఏమి తినాలో ఏమిచెయ్యాలో ఎలా వుండాలో నిర్ణయించే మార్కెట్…వీటి మధ్యే తిరుదుతున్న, పెరుగుతున్న పిల్లలకు ప్రేమంటే????

వీళ్ళకి పరిసరాలను, చుట్టు వున్న సమాజాన్ని, ప్రకృతిని, చుట్టూవున్న మనుషుల్ని, టీచర్లని, తోటి పిల్లల్ని, తాతయ్యల్ని, అమ్మమ్మల్ని, నానమ్మల్ని, చివరికి మమ్మీ, డాడీలని కూడా ప్రేమించడం తెలియదు. వియ్ లవ్ ఆల్ అని పెట్ యానిమల్స్ పేర్లను కలుపుకుని పెద్ద లిస్టే చదువుతారు…అందరినీ ప్రేమిస్తున్నామనే అనుకుంటారు…అసలు వీళ్ళకి ప్రేమంటే తెలియదు…

వీళ్ళకి ప్రేమంటే- యవ్వనంలో స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణను పరస్పరం వ్యక్తీకరించుకునే మోడ్…ఇష్టపడినది దక్కని స్ధితి ఎదురైతే ఆ షాక్ నుంచి బయటపడటానికి సమాజంలో సమాజంతో వీరికి బలమైన అనుబంధాలు లేవు…దేనికోసమో బతకాలి బతికితీరాలి అనుకోడానికి వీరికి ఏ విధమైన ఆలంబనా లేదు…

పరిసరాల్ని ప్రేమించలేనివారు పౌరులు కాలేరు…ప్రతి ఒక్కరిలో స్వాభావికంగా వుండే భావనాత్మక సౌందర్యం ( ఈస్ధటిక్ సెన్స్) భౌతిక ప్రపంచాన్ని మించిన భావనా ప్రపంచాన్ని పిల్లల హృదయంలో, మనసులో, ఆలోచనలలో నిర్మిస్తుంది…అది లౌకికప్రపంచంలో కార్నర్ అయిపోయినప్పుడు మనుషులకు సేఫ్టీ నెట్ అవుతుంది…అది మనుషుల్ని అక్కున చేర్చుకుని కొత్తజీవితానికి, కొత్త అనుబంధాలకు ప్రేరణ ఇస్తుంది…విఫలమైన / భగ్నమైన ప్రేమ కొంత సమయం తీసుకుని తిరిగి హృదయానికి చేరుకుంటుంది…

అసలు, సమస్యంతా పిల్లలకు భావనా ప్రపంచం లేకపోవడమే…మమ్మీ, డాడీ, కుటుంబం, నైబర్స్, స్నేహితులు, టీచర్లు, సమాజం, ప్రకృతి….దేనితోనూ అటాచ్ మెంటు లేకుండా పెరిగే పిల్లలకు మానసిక పర్యావరణం / ఎమోషనల్ ఎన్విరాన్ మెంటు ఎక్కడుంటుంది?

మోదీ ఎఫ్ డి ఐ దూకుడుపై – స్వదేశీ జాగరణ్ మంచ్ అభ్యంతరం!


26 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో చర్చించాలన్న ప్రజాస్వామిక ధర్మాన్ని, కనీసం కేబినెట్ సహచరులతో చర్చించాలన్న మర్యాదను కూడా పక్కన పెట్టేసి విదేశీ కార్పొరేట్ల ను సంతోషపరడానికి రాత్రికి రాత్రే ఎఫ్ డి ఐ అనుమతులపై ఉత్తర్వులు జారీ చేయించిన మోదీ దూకుడుని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆర్ ఎస్ ఎస్ అనుబంధ సంస్ధ ఎస్ జె ఎం కూడా ఎఫ్ డి ఐ ల పై అభ్యంతరాన్ని ప్రకటించింది…
    

బీహార్ పై సోనియా మౌనం!


కాంగ్రెస్ కు కొత్త ఊపిరి పోసిన బీహార్ ఎన్నికల ఫలితాలే రాహుల్ రాజకీయ భవిష్యత్తుకి అవరోధంగా కూడా ఎదురౌతున్న క్లిష్టపరిస్ధితి సోనియా ముందు వుంది. 

  

బీహార్ పై సోనియా మౌనం!

”హరితాంధ్ర”-ఈమాట అనే అర్హత వుందా?


హరితాంధ్రప్రదేశ్ నినాదం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడవులు హరించుకుపోతూండటానికి కారకులౌతూండటం పెద్ద విషాదం. బాక్సైట్ తవ్వకాలతో కలిపి దాదాపు 50 వేల ఎకరాల అటవీ భూముల్ని డీ నోటిఫై చేయాలని రాష్ట్రప్రభుత్వం కోరుతున్న నేపధ్యంలో లెక్కల్ని విశ్లేషించినపుడు ఉపన్యాసాలు మినహా పచ్చదనం పై చంద్రబాబు ఎప్పుడూ ప్రత్యేక దృష్టి పెట్టిన సందర్భాలు లేవని బయటపడుతోంది.

”హరితాంధ్ర”-ఈమాట అనే అర్హత వుందా?

  ”హరితాంధ్ర”-ఈమాట అనే అర్హత వుందా?

”బాక్సైట్‌” మాట తప్పిన బాబు


మేం అధికారంలో ఉన్న ప్పుడు బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతిచ్చిన మాట నిజమే. అయితే, ప్రజాభిప్రాయాన్ని, పర్యావరణాన్ని పరిగణలోకి తీసుకుని ఆ ప్రతిపాదనను విరమించాం. స్థానిక గిరిజనుల అభిప్రాయాలను, పర్యావరణ సమస్యల ను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ మాత్రం పట్టిం చుకోవడం లేదు.” విశాఖపట్టణంజిల్లా అనంతగిరి సభలో 2010 నవంబరు 18 న ప్రతిపక్షనేత హోదాలో చంద్రబాబు నాయుడు ఈ హామీ ఇచ్చారు.
  
”బాక్సైట్‌” మాట తప్పిన బాబు

పోరు బాటలో సీమ నేతలు?


ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క అనంతపురం జిల్లాలోనే సుమారు 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే వ్యవసాయ ఆధారిత జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఉపాధి కోసం ఇదే జిల్లా నుంచి ఐదు లక్షల మంది కూలీలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు. కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని సుగాలితాండాల మహిళలు పొట్ట నింపుకునేందుకు ఢిల్లీ, ముంబయి, పూణే తదితర నగరాల్లోని రెడ్‌లైట్‌ ఏరియాలకు తరలిపోవడం మరో విషాదం.

పోరు బాటలో సీమ నేతలు?
  

మోదీ – బాబు ఎదురీత!


ప్రస్తుతానికి మనకి పనికిరాని ఈ అభివృద్ది మోడల్ ని వదిలేసి ఆర్ ఎస్ ఎస్ సూచించినట్టు భారతీయ నమూనా ను సిద్ధం చేసుకోవడమే ఉత్తమం…కాని పక్షంలో ”సస్టెయిన్ బుల్ మేక్ ఇన్ ఇండియా” దాదాపు అసాధ్యమే!
  

కల్చరల్ పోలీసింగ్ పై ఆవేదన అవార్డుల వాపసుతో రచయితల నిరసన


మతద్వేషం, ప్రశ్నించే వారిపై దాడులూ, ఆందొళనకరంగా పెరిగిపోతున్న ”కల్చరల్ పోలీసింగ్” పై రచయితల అవేదనకు, నిరసనకూ ఉన్నత స్ధాయి నుంచే స్పందన రావాలి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనం వీడాలి…దురదృష్టకరం…మాకు సంబంధంలేదు వంటి పొడిపొడి ఖండనలు కాకుండా ఆవేదనకు ఉపశమనం కలిగించాలి.
http://www.telugu360.com/te/writters-refunding-govt-awards-in-protest/