కూల్చివేత…ప్రాధాన్యతా!ప్రతీకారమా! దృష్టిమళ్ళింపా! టైంపాసా! (శనివారం నవీనమ్)


రాష్ట్ర ప్రభుత్వం “ప్రజావేదిక”ను కూల్చివేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వుంటున్న అక్రమ నిర్మాణ నివాసాన్ని కూల్చివేయడాన్ని కూడా తప్పుపట్టవలసిన పని లేదు…

అయితే, రాష్ట్రవ్యాప్తంగా కరకట్టలను ఆక్రమించుకుని నివశిస్తున్న లక్షకు పైగా ఇళ్ళ మాటేమిటి? పోనీ విజయవాడలోనే కరకట్ట మీద వుంటున్న పదిహేను వేల నివాసాల మాటేమిటి? వాటిలో నివశిస్తున్న పేద కుటుంబాలకు పునరావాసం ఎలా అన్న ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం లేదు.

Read more

జీవనశూన్యంలో నైతికతను వొంపే తీర్ధయాత్ర!


జీవనశూన్యంలో నైతికతను వొంపే తీర్ధయాత్ర!

(పెద్దాడ నవీన్ 19-7-2015)

మూఢభక్తితోకానీ, చేసినతప్పులన్నీ రద్దయిపోతాయన్న అత్యాశ వల్లగానీ, ఓ సారి చూసివద్దాం అన్న కుతూహలం వల్లగానీ, అలవాటుగా పెరుగుతున్న యాత్రావినోదంగాకానీ, ప్రజల్లో ఆలయాల సందర్శన పెరుగుతూవుంది.

ఇవాళ అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఆలయ సందర్శన తో సహా కొంతకాలంగా కుటుంబసమేతంగా నేను చేస్తున్న తీర్ధయాత్రల్లో చాలా విషయాలు గ్రహిస్తున్నాను.

జీవితాన్ని ఆక్రమించుకుంటున్న శూన్యాన్ని పుణ్యక్షేత్తాలూ, తీర్ధయాత్రలూ నింపుతున్నట్టున్నాయి. దర్శనాలు, పూజా క్రతువుల ద్వారా ఒక నిబద్ధతను, ధార్మిక ప్రసంగాల వల్ల ఒక ప్రాతిపదికను, ఆధ్యాత్మిక భావాల వల్ల తాపత్రయాలు వీలైనంత వొదిలించుకోవాలన్న తాత్వికతనూ, ఎంతోకొంత ప్రజలు నింపుకుంటున్నారు.

నిజానికి ఇవన్నీ ఎంతో కొంత భారతీయ సమాజపు భావజాలంలోనే వున్నాయి.

తరం నుంచి మరో తరానికి ఈ భావాలను రీఇన్ ఫోర్స్ చేసుకోవడమే తీర్ధయాత్రల రద్దీ పెరగడానికి మూలం. గ్రామాల్లో ఆలయాలు ప్రత్యక్షంగా సంఘజీవనాన్ని పటిష్టం చేయడంతోపాటు ఊరి ఆరోగ్య సంరక్షణకు ప్రాధమిక కేంద్రాలుగా కూడా వుండేవి. ఇపుడు గ్రామాలు అంతరించిపోతున్నాయి. సమాచార, రవాణా వసతులు పెరిగే గ్లోబల్ వాతావరణం కళ్ళముందుకి వచ్చేసింది. చిన్నా చితకా అంతరించిపోయి మెగావే మిగలడం గ్లోబల్ లక్షణమే.

ఆప్రకారమే సింహాచలం, అన్నవరం, విజయవాడ, శ్రీశైలం, తిరుమల లాంటి ”పెద్ద” ఆలయాలు చేసుకున్న పుణ్యం అంతా ఇంతాకాదు. బస్సులు, కార్లు, రైళ్ళు, విమానాలకు ప్రజల్ని ఈ ప్రాంతాలకు చేర్చడం మీదుండే ఇంట్రెస్టు అంతా ఇంతాకాదు.

ఏమైతేనేమి పూజాక్రతువులనుంచి, ధార్మిక ఆలోచనలనుంచి, ఆధ్యాత్మిక చింతనల నుంచీ ప్రజలు భక్తి భావాలకంటే జీవితాల్లో నైతికతను నింపుకుంటున్నారనీ, నైతిక బలాన్ని సుసంపన్నం చేసుకుంటున్నారనీ అర్ధమౌతోంది.

ప్రపంచాన్ని పరిచయం చేసుకోడానికి క్షణక్షణం అవకాశమున్న కమ్యూనికేషన్ యుగంలో మనుషుల అవగాహనలకు హేతుబద్దతే ప్రాతిపదిక కావడంలో ఆశ్చర్యం లేదు. ఆర్జిత సేవల విషయంలో సిబ్బందినీ అర్చకుల్నీ ప్రశ్నించే లక్షణం బాగా పెరిగింది. చెల్లించిన సేవలపై నిలదీయడనికి అది వారికి డబ్బు ఇచ్చిన ధీమా!

ఎన్ని అసౌకర్యాలనైనా ఓర్చుకుని సహించే దిగువమధ్య తరగతివారు సర్వదర్శనం క్యూలలో అవసరమైతే ఎవరినైనా నిలదీయడానికి సంకొచించని నిర్మొహమాట స్వభావం ”ప్రశ్నించే” అలవాటు పెరుగుతోందనడానికి ఒక సంకేతం.

బ్యాలెట్ బాక్సుల్లో ఈ ”ప్రశ్నలే” ఫలితాల అంచనాలను తారుమారు చేసేవని అర్ధంచేసుకోవచ్చు.

ఆలయాలకు సకుటుంబాలుగా వచ్చే యాత్రికుల్లో చాలా సందర్భాల్లో టూర్ మేనేజర్లు ఆ ఇంటి గృహిణులు కూతుర్లు కోడళ్ళే. ఇది స్త్రీ స్వాభావికమైన మేనేజీరియల్ స్కిల్లే.

ఇవన్నీ పక్కనపెట్టేయండి…రాశులుపోసినట్టు వుండే మనుషుల జీవన సౌందర్యం తీర్ధయాత్రల్లో తప్ప, ఆలయ సందర్శనల్లోతప్ప ఇంకెక్కడ కనబడుతుంది? అసలు మనుషుల్ని మించిన దేవతలూ, దేవుళ్ళూ ఇంకెవరున్నారు? అందుకే దీన్నొక బ్రాండుగా, ఐకాన్ గా ”ముక్కోటి దేవతలు”అన్నారు. #GodavariPost

పిల్లలలో అసంబంధాలు / Unattached Life


పెద్దాడ నవీన్)

20-7-2018

ఇంటికే పరిమితమైన సామాజిక జీవనం…లివింగ్ రూమ్ కే పరిమితమైన

కుటుంబ జీవనం…మమ్మీ, డాడీ – వాళ్ళ తోబుట్టువులను, వారి బాధ్యతలను వొదిలించుకోడానికి చూపించే లౌక్యం, పడే శ్రమ…పైమెట్టు మీద వున్నవారితో పరిచయాలు పెంచుకునే తాపత్రయాలు, సంబంధాలు, స్నేహాలు…

వ్యక్తిత్వ వికాసానికి అమ్మ నాన్నల గైడెన్స్ అవసరమైన టీనేజిలో మనోభావాల్ని, సహజస్పందనల్ని చిదిమేసే బ్రాండ్ (నారాయణ చైతన్య)చదువులు…అవసరానికి మించి యిచ్చే పాకెట్ మనీ…ఏమి తాగాలో ఏమి తినాలో ఏమిచెయ్యాలో ఎలా వుండాలో నిర్ణయించే మార్కెట్…వీటి మధ్యే తిరుదుతున్న, పెరుగుతున్న పిల్లలకు ప్రేమంటే????

వీళ్ళకి పరిసరాలను, చుట్టు వున్న సమాజాన్ని, ప్రకృతిని, చుట్టూవున్న మనుషుల్ని, టీచర్లని, తోటి పిల్లల్ని, తాతయ్యల్ని, అమ్మమ్మల్ని, నానమ్మల్ని, చివరికి మమ్మీ, డాడీలని కూడా ప్రేమించడం తెలియదు. వియ్ లవ్ ఆల్ అని పెట్ యానిమల్స్ పేర్లను కలుపుకుని పెద్ద లిస్టే చదువుతారు…అందరినీ ప్రేమిస్తున్నామనే అనుకుంటారు…అసలు వీళ్ళకి ప్రేమంటే తెలియదు…

వీళ్ళకి ప్రేమంటే- యవ్వనంలో స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణను పరస్పరం వ్యక్తీకరించుకునే మోడ్…ఇష్టపడినది దక్కని స్ధితి ఎదురైతే ఆ షాక్ నుంచి బయటపడటానికి సమాజంలో సమాజంతో వీరికి బలమైన అనుబంధాలు లేవు…దేనికోసమో బతకాలి బతికితీరాలి అనుకోడానికి వీరికి ఏ విధమైన ఆలంబనా లేదు…

పరిసరాల్ని ప్రేమించలేనివారు పౌరులు కాలేరు…ప్రతి ఒక్కరిలో స్వాభావికంగా వుండే భావనాత్మక సౌందర్యం ( ఈస్ధటిక్ సెన్స్) భౌతిక ప్రపంచాన్ని మించిన భావనా ప్రపంచాన్ని పిల్లల హృదయంలో, మనసులో, ఆలోచనలలో నిర్మిస్తుంది…అది లౌకికప్రపంచంలో కార్నర్ అయిపోయినప్పుడు మనుషులకు సేఫ్టీ నెట్ అవుతుంది…అది మనుషుల్ని అక్కున చేర్చుకుని కొత్తజీవితానికి, కొత్త అనుబంధాలకు ప్రేరణ ఇస్తుంది…విఫలమైన / భగ్నమైన ప్రేమ కొంత సమయం తీసుకుని తిరిగి హృదయానికి చేరుకుంటుంది…

అసలు, సమస్యంతా పిల్లలకు భావనా ప్రపంచం లేకపోవడమే…మమ్మీ, డాడీ, కుటుంబం, నైబర్స్, స్నేహితులు, టీచర్లు, సమాజం, ప్రకృతి….దేనితోనూ అటాచ్ మెంటు లేకుండా పెరిగే పిల్లలకు మానసిక పర్యావరణం / ఎమోషనల్ ఎన్విరాన్ మెంటు ఎక్కడుంటుంది?

”పుష్యమి కార్తెలో వాన – ఊరపిచుక నైనా తడపదు”


ఈ సామెత గుర్తురాక కోసం ముగ్గురు స్నేహితులకు ఫోన్ చేశాను. ఈ ఉదయం లేచి పేపర్ చదువుతూండగా పెద్దశబ్దంతో వాన. ఇక ఇవాళ పనులన్ని ఆగిపోయినట్టే అని డిసైడైపోయి, వానచూస్తూ కుర్చోవచ్చని సెటిలైపోయాను. ఈ కాసిని అక్షరాలు టైప్ చేసినంత సేపుకూడా వానలేదు. ఆకస్మికంగా ఆగిపోవడం, చిటపడలాడించే ఎండరావడం ఒకేసారి జరిగాయి.

కేలెండర్ చూద్దునా! పుష్యమి కార్తెకు రెండురోజులు ముందు పునర్వసు కార్తె చివరన ఉన్నామని అర్ధమైంది. ఈ కార్తలో వర్షాలు ఇంతే! ఇప్పటికే పడిన వర్షాలకు ఇంకిపోయిన నేల మీద (పేరుగుమీద మీగడ లాంటి) మెత్తటి పొరను కన్సాలిడేట్ చేయడమే – దీన్నే ‘ఇవక’ వేయడం అంటారు. ఇదే ఈ కార్తెలో ఎపుడైనా గెస్ట్ అపియరెన్స్ ఇచ్చే వానల ప్రయోజనం!

అర్ధం కాలేదా? నా క్లాస్ చదవడానికి రెడీ అయిపోండి 😀😀…ఈ కార్తెలు వ్యవసాయ పంచాంగానికి మూలాధారాలు…గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధకు కేలెండర్లు.

మనకి 27 నక్షత్రాలు వున్నాయి కదా! ఒకో నక్షత్రమూ ఒకో కార్తె! ఒకో కార్తె కు 13/14 రోజులు వుంటాయి. తెలుగు సంవత్సరాదినుంచి అప్పటి వరకూ ఎన్నిరోజులో ఆసంఖ్యను 14 తో భాగిస్తే వచ్చే నంబరు ఏనక్షత్రానిదో చూస్తే అపుడు ఆకార్తెలో వున్నట్టు అన్నమాట! అర్ధం కాలేదా? వొదిలెయ్యండి పెద్ద ప్రమాదమేదీ లేదు.

పర్యావరణం దెబ్బతిని రుతువులు గతులు తప్పడం వల్ల ఏ కార్తెలో జరగవలసినవి ఆకార్తెలో జరగడం లేదు. వ్యవసాయమే మారిపోయింది. రైతులే కార్తెల్ని మరచిపోయారు.

అయితే, ఆయా కార్తెల్లో వాతావరణం ప్రజల మీద ఎలాంటి ప్రభావం కలుగజేస్తూందో సామెతలుగా మిగిలిపోయాయి…అవికూడా వెతికితే తప్ప కనబడని జ్ఞాపకాల మూటలైపోయాయి.

సాయంత్రం పుణ్యక్షేత్రం అనే ఊరివద్ద ఒక స్నేహితుని పొలం లోకి వెళ్ళాను . షూ కారులోనే వదిలేసి కాసేపు నడిచేసరికి అంగుళం మందాన డార్క్ గ్రే కలర్ షూ వేసుకున్నట్టు కాళ్ళు మట్టిని తొడుక్కున్నాయి. ఇప్పటి వరకూ వచ్చిన వానలకు నేల కడుపు నిండింది. తరువాత పడే వానలు లోనికి దిగకుండా, ఎండలకు లోపలి నీరు ఆవిరైపోకుండా పుష్యమి వానలకు నేలమీద పేరుకునే ఇవక పొర ఫిల్టర్ గా అడ్డుపడుతుందన్నమాట! –అయిపోయింది😀

#GodavariPost

భారతీయ సమాజాన్ని ఉద్వేగపరచే చంద్రయాన్ – 2


చందమామ చెక్కిలి మీటితే తడితగిలిన మాట గుర్తుకొస్తే, ఆనిర్ధారణ చేసిన యూరీ గెగారిన్ – మనసులో ఒక ఉద్వేగమైపోతాడు. భూమాత చుట్టూ తిరుగుతున్న చందమామ ఏకాంతం నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ పాదముద్రతో ముగిసిపోయిందన్న జ్ఞాపకం 50 ఏళ్ళతరువాత కూడా ఉత్తేజభరితమే!

ఒకదానిని మించిన మరొక స్వదేశీ రాకెట్‌ తయారుచేస్తూ, చంద్రయానాలను, మంగళయానాలను ఘనంగా నిర్వహించిన ఇస్రో చరిత్ర జనం ఎమోషన్లలో కదలాడుతూ వుంటుంది.

రాకేష్‌ శర్మ సోవియట్‌ నౌకలో విహారం చేస్తూ ‘సారే జహాసె అచ్ఛా’ అన్నందుకే మురిసిపోయిన భారతదేశం, 39 ఏళ్ళ తరువాత కూడా ఇపుడు పులకరించి పోతున్నట్టు వుంది.

మరో 3 ఏళ్లకు మన స్వదేశీ నౌక ముగ్గురు భారతీయులతో అంతరిక్ష యానం జరిపబోతున్నందుకు ఇపుడే గర్వంతో ఒళ్ళు జలదరిస్తున్నట్టుంది.

భారత్ మొదటి చంద్రయానానికీ, (ఆరాత్ర) 15-7-2019 తొలిఘడియల్లో ప్రయాణమయ్యే చంద్రయాన్ 2 కీ ప్రయోగం స్థాయిలోనూ, పరిశోధన రీతిలోనూ చాలా పెద్దతేడా ఉన్నది.

ఈ సారి భారత్‌ అక్కడ ల్యాండర్‌, రోవర్లను దింపబోతున్నది. సాంకేతికంగా మనకంటే ఎంతో ముందున్న ఇజ్రాయెల్‌ విఫలమైన చోట, గెలవాలని భారత్‌ సంకల్పించింది. ఈ ప్రయోగం సంక్లిష్టతను బట్టి , ‘ఇస్రో’ శివన్‌ దీనిని ఓ భయానక ప్రక్రియగా అన్నారు.

జులై 15న జీఎస్‌ఎల్‌వి–మార్క్‌ 3 రాకెట్‌ శ్రీహరి కోటనుంచి బయలుదేరి చంద్రునివద్దకు ప్రయాణం మొదలెడితే, సెప్టెంబరు ఆరు లేదా ఏడోతేదీన ల్యాండర్‌ అక్కడ వాలబోతున్నది.

ఇప్పటివరకూ ఎవరూ కన్నెత్తిచూడని, ఏ ప్రయోగమూ స్పృశించని చంద్రుని దక్షిణ ధృవం సమీపాన దిగబోతున్నాం. కాస్త ఎక్కువ మంచుతో ఖనిజాలతో నిండిన ఈ ప్రాంతం కొత్త అన్వేషణలకు వీలుకల్పిస్తుంది. చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించగానే ఆర్బిటార్‌నుంచి వేరుపడిన ల్యాండర్‌ నెమ్మదిగా అక్కడి నేలను తాకి, అందులోనుంచి ఐదువందల మీటర్ల వరకూ కదలగలిగే రోవర్‌ బయటకు వస్తుంది.

ఆర్బిటార్‌ సంవత్సర కాలం పనిచేస్తుంది కానీ, సూర్యుని అత్యధిక రేడియేషన్‌ కారణంగా ల్యాండర్‌, రోవర్ల జీవితకాలం మాత్రం పద్నాలుగు రోజులే. ఈ మూడూ స్వతంత్రంగానూ, సమన్వయంతోనూ పనిచేస్తూ, చంద్రుని ఉపరితలంలోని నీటినీ, ప్రకంపనలను పసిగడతాయి. తవ్వకాలు జరిపి ఖనిజాలు, హీలియం జాడల వివరాలు అనేకం శోధిస్తాయి.

3.85 లక్షల కిలోమీటర్ల ప్రయాణంలో జీఎస్‌ఎల్‌వి పలుమార్లు తన దిశను మార్చుకోవడానికి విభిన్న కోణాల్లో పేలుతూ కాలుతూ సాగే విన్యాసాన్ని అటుంచితే, ఆర్బిటార్‌ నుంచి వేరుపడిన ల్యాండర్‌ చంద్రుని నేలమీదకు అతినెమ్మదిగా జారిపడే ఆ 17 నిముషాల కాలం ఈ మొత్తం ప్రయోగంలో అతి కీలకమైన, ప్రమాదకరమైన దశ.

2008లో యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, నాసా సహకారంతో జరిగిన తొలి చంద్రయానంలో నీటి జాడలు కనిపెట్టిన మనం, ఇప్పుడు ఓ కొత్త ప్రాంతంలో కాలూని ఎన్ని రహస్యాలు ఛేదిస్తామో చూడాలి.

పదివేలకోట్ల విలువైన ఈ ప్రాజెక్టు అవసరాల్లో 60శాతం ప్రైవేటు రంగం నుంచే తీరబోతున్నందున కొత్త ఉపాధులకు ఊతం వస్తుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ప్రాజెక్టులో భాగస్వామి కాకుండా, రోదసిలో మనకంటూ ఓ అంతరిక్ష కేంద్రాన్ని కట్టుకోబోతున్నట్టు ఇస్రో ఇప్పుడు బహిరంగంగా చెప్పి ఉండవచ్చును కానీ, ఇందుకు సంబంధించిన కృషి మూడేళ్ళుగా సాగుతున్నది.

చిన్నదో, పెద్దదో మనకంటూ ఓ కేంద్రాన్ని నిర్మించుకోవడం మానవయానానికీ, విహారాలకు సిద్ధపడుతున్న భారతదేశానికి అవసరం. వ్యోమగాముల తరలింపు, మార్పిడి వంటి ప్రక్రియలు దీనివల్ల సులభమవుతాయి.

మనకు నచ్చిన, అవసరాలకు తగిన మరిన్ని ప్రయోగాలు యథేచ్ఛగా చేసుకోవచ్చు. రోదసి కార్యక్రమానికి సంబంధించి ఒక విస్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగిపోతున్న ఇస్రో శాస్తవేత్తలూ, అధికారులూ, సమస్త సిబ్బందీ జిందాబాద్! జిందాబాద్! జిందాబాద్!

మోదీ ఎఫ్ డి ఐ దూకుడుపై – స్వదేశీ జాగరణ్ మంచ్ అభ్యంతరం!


26 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో చర్చించాలన్న ప్రజాస్వామిక ధర్మాన్ని, కనీసం కేబినెట్ సహచరులతో చర్చించాలన్న మర్యాదను కూడా పక్కన పెట్టేసి విదేశీ కార్పొరేట్ల ను సంతోషపరడానికి రాత్రికి రాత్రే ఎఫ్ డి ఐ అనుమతులపై ఉత్తర్వులు జారీ చేయించిన మోదీ దూకుడుని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆర్ ఎస్ ఎస్ అనుబంధ సంస్ధ ఎస్ జె ఎం కూడా ఎఫ్ డి ఐ ల పై అభ్యంతరాన్ని ప్రకటించింది…
    

ఇది మతాతీత విశ్వాసం! 


ఇది మతాతీత విశ్వాసం! 
ఇవాళ సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళినీ, మొన్న హైదరాబాద్ లో పెద్దమ్మ తల్లినీ చూశాము. 
జీవితాన్ని కలుషితం చేసుకున్న మనం…నైతికతను కోల్పోయిన మనుషులం…అసంతృప్తులను చల్లబరచుకోడానికో శూన్యాల్ని పూడ్చుకోడానికో మతాన్ని కౌగలించుకున్నాం…మనిషి ఉనికిని ఆధ్యాత్మికత ద్వారా సిద్ధాంతీకరించే ప్రయత్నం చేసే మతం మీద నాకు తృణీకారమైతే లేదుగాని, మతం మీదకంటే గ్రామ దేవతలంటేనే ప్రేమ గౌరవాలు వున్నాయి. 
పెద్దపెద్ద కళ్ళతో పసుపు పచ్చ శోభతో మూడడుగులు కూడా ఎత్తులేని ఈ పెద్దమ్మ, మహంకాళి తల్లులు ప్రజల నమ్మకాల్లో ఎవరెస్టుకి మించిన ఎత్తులో వున్నారు. 
జీవనవిధానంలో ఒకవిధమైన ప్రాకృతిక ధర్మాన్ని, నిరాడంబరతనీ, సొంత నైతికతనీ పాటించే మనిషి సాంఘిక స్వయంభువత్వమే మతాతీత విశ్వాసం. అక్కడ అన్నంలో బిరుసైన మొరటుతనం వున్నా, బలి ఇచ్చే కోడీ మేకా దున్నల చావు వాసన ఆవరించివున్నా ఏదో పవిత్రత అనుభూతిలోకి వస్తూనే వుంటుంది. 
జంగారెడ్డిగూడెం గంగానమ్మ జాతర, తాడువాయి వీరభద్రుడి తిరనాళ్ళ, నిడదవోలులో కొటసత్తెమ్మ మొక్కు, గోదావరి కుడి గట్టున గుబ్బలమంగమ్మ గుడి, రాజమండ్రిలో సోమాలమ్మ కాపలా, లోవలో తలుపులమ్మ తల్లిదయ…మతంతో నిమిత్తంలేని ఇన్ని జాతర్లు, మరెన్ని సంబరాలు నమ్మకానికీ, ఇచ్చిన మాట నిలబెట్టుకునే / మొక్కుతీర్చుకునే మనిషి నిబద్ధతకీ ఆనవాళ్ళు…అన్నిమతాలవారూ తీర్చుకునే మొక్కబళ్ళు
రాజమండి ఇస్కాన్ టెంపుల్ లో పరిమళాలు బాగుంటాయి. పాతసోమాలమ్మ గుడిలో కూర్చుంటే ఇది నాది అనిపిస్తుంది. కంచిమఠం లో గంభీర ప్రశాంతత కంటే అర్ధంకాని మంత్రాలు అతి తక్కువగా వుండే హైదరాబాద్ పెద్దమ్మ గుడిలో, సికిందరాబాద్ మహంకాళి గుడిలో…అసలు ఏగ్రామదేవతల గుడిలో అయినా మనుషుల అలికిడి అలజళ్ళే నచ్చుతాయి. 
మామూలు మనిషిని కాస్తదూరంగా వుంచే మతంకంటే, కష్టమొచ్చినపుడు చేయి పట్టుకున్నట్టు భరోసా ఇచ్చే మతాతీతమైన విశ్వాసమే నాకు ఇష్టంగా వుంటుంది.
మొక్కుకోవడానికి ఒకసారి, మొక్కు చెల్లించుకోడానికి మరోసారి జనులు తరలి వచ్చే యాత్రలో ఖర్చయ్యే ప్రతి రూపాయీ మన చుట్టూ వున్న ఎకనామిక్స్ ఎలా, ఎంతగా స్టిమ్యులేట్ చేస్తూందో గుడి చుట్టూ వున్న దుకాణాల్ని కాసేపు గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 

  

బీహార్ పై సోనియా మౌనం!


కాంగ్రెస్ కు కొత్త ఊపిరి పోసిన బీహార్ ఎన్నికల ఫలితాలే రాహుల్ రాజకీయ భవిష్యత్తుకి అవరోధంగా కూడా ఎదురౌతున్న క్లిష్టపరిస్ధితి సోనియా ముందు వుంది. 

  

బీహార్ పై సోనియా మౌనం!

”హరితాంధ్ర”-ఈమాట అనే అర్హత వుందా?


హరితాంధ్రప్రదేశ్ నినాదం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడవులు హరించుకుపోతూండటానికి కారకులౌతూండటం పెద్ద విషాదం. బాక్సైట్ తవ్వకాలతో కలిపి దాదాపు 50 వేల ఎకరాల అటవీ భూముల్ని డీ నోటిఫై చేయాలని రాష్ట్రప్రభుత్వం కోరుతున్న నేపధ్యంలో లెక్కల్ని విశ్లేషించినపుడు ఉపన్యాసాలు మినహా పచ్చదనం పై చంద్రబాబు ఎప్పుడూ ప్రత్యేక దృష్టి పెట్టిన సందర్భాలు లేవని బయటపడుతోంది.

”హరితాంధ్ర”-ఈమాట అనే అర్హత వుందా?

  ”హరితాంధ్ర”-ఈమాట అనే అర్హత వుందా?

”బాక్సైట్‌” మాట తప్పిన బాబు


మేం అధికారంలో ఉన్న ప్పుడు బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతిచ్చిన మాట నిజమే. అయితే, ప్రజాభిప్రాయాన్ని, పర్యావరణాన్ని పరిగణలోకి తీసుకుని ఆ ప్రతిపాదనను విరమించాం. స్థానిక గిరిజనుల అభిప్రాయాలను, పర్యావరణ సమస్యల ను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ మాత్రం పట్టిం చుకోవడం లేదు.” విశాఖపట్టణంజిల్లా అనంతగిరి సభలో 2010 నవంబరు 18 న ప్రతిపక్షనేత హోదాలో చంద్రబాబు నాయుడు ఈ హామీ ఇచ్చారు.
  
”బాక్సైట్‌” మాట తప్పిన బాబు