స్పందనా రాహిత్యమే జాతీయ విధానం ఎవరికీ పట్టని రైతు ఆత్మహత్యలు


ఇది…కష్టాలు, ఆశలు అరణ్యరోదనగా మారినపుడు, తమ మనోభావాలకు వేదికగా వుండవలసిన ప్రజా ప్రతినిధులు దగా పూరితంగా వ్యవహరిస్తున్నపుడు, రైతులు తమ గుండెకోతను వ్యక్తం చేయడానికి మిగిలిన మార్గం…ఆత్మహత్య
ఇది…వ్యక్తిగతం కాదు, వ్యవస్ధీకృతం!

స్పందనా రాహిత్యమే జాతీయ విధానం ఎవరికీ పట్టని రైతు ఆత్మహత్యలు

IMG_0379

ధర రాదు అప్పుతీరదు యూరప్ రైతులదీ అదే కథ!


జీవన వ్యాపకాల్లో మౌలికమైన మార్పులు వచ్చినపుడు తలఎత్తే సంక్షోభాలు వ్యవస్ధాగతమైన ఆత్మహత్యలుగా మారిపోతున్నాయని ప్రపంచఅనుభవాలు రుజువు చేస్తూనే వున్నాయి. నివారణలకు ప్రత్యామ్నాయాలను కనుగొనడంలో ప్రభుత్వాలు విఫలమౌతూనే వున్నాయి. ఏ ఆర్ధిక సంక్లిష్టతకైనా మొదటి వేటు వేస్తున్నది వ్యవసాయరంగం మీదే!

http://www.telugu360.com/te/european-farmers-demand-aid-as-produce-prices/

  

ఉసురు


ఒక బాకీ వున్న వ్యక్తికి అదితీరకుండా, లేదా రీషెడ్యూలు కాకుండా, ఏ బ్యాంకూ కొత్త రుణం ఇవ్వదు. ఈ షరతులకు లోబడే రైతులు అప్పులతో వ్యవసాయం చేస్తున్నారు. 

చంద్రబాబునాయుడు, రుణమాఫీ చేస్తామన్నారు. 50 వేలరూపాయలకు మించిన రుణాలున్నవారిలో ఏడాదికి 20 శాతం మందికి మాఫీ అని ముఖ్యమంత్రి అయ్యాక ఒక ఫిల్టర్ పెట్టారు. రుణాలు మాఫీ అయిపోతున్నాయి అన్న ఆశతో రైతులు వడ్డీలు కట్టడం మానేశారు. బకాయిలు చక్రవడ్డీలైపోయాయి. బాకీతీరలేదు…రుణం రీషెడ్యూలుకాలేదు…రుణాన్ని ప్రభుత్వం తనపేరుకు బదలాయించుకోలేదు..రైతులకు ప్రభుత్వం ఇచ్చిన బాండ్లను బ్యాంకులు తీసుకోవడం లేదు…
ఇందువల్ల చాలాకాలం తరువాత సార్వా పెట్టుబడులకు ప్రయివేటు వ్యాపారినుంచి వడ్డీకి డబ్బుతేవలసి వచ్చింది..కష్టమో సుఖమో అప్పులతోనే రైతులు బతుకుతూంటే చంద్రబాబు రుణాల మాఫీ అని ఇంకా అప్పులో ముంచేశాడు. 85 పైసల బాంకు వడ్డీ నుండి రెండున్నరరూపాయల ప్రయివేట్ వడ్డీలోకి నెట్టేశాడు
ఈ మాటలు నావి కాదు చల్లావారిగూడెం రైతు టేకి ఆంజనేయులు చెప్పిన వివరాలు. ఆయన విద్యావంతుడైన 12 ఎకరాల మెట్టరైతు. ఆయన కుటుంబంలో ఒకరికి న్యూరలాజికల్ సమస్యవుంది. నేను పనిచేసే జిఎస్ఎల్ మెడికల్ కాలేజి టీచింగ్ హాస్పిటల్ లో ఆసర్జరీ వుందా అనితెలుసుకోడానికి ఆంజనేయులు ఫోన్ చేశారు. మూడురోజులుగా సంబంధిత డాక్టరు, నేను, ఆంజనేయులు ఫోన్ లో మాట్లాడుతున్నాం. ఆసమస్యకు పరిష్కారం దొరికింది. కాస్తకుదుటబడిన ఆంజనేయులుతో వ్యవసాయం ఎలావుందని ప్రశ్నించినపుడు ఇదంతా చెప్పారు.
ఆంజనేయలు చెప్పకపోయినా కూడా అనేకమంది రైతుల అనుభవాల వల్ల ఇదంతా నాకు ముందే తెలుసు…
రాషా్ట్రనికి స్పెషల్ స్టేటస్ విషయంలో మోసం చేసిందని రాజకీయపార్టీలు, (నాతో సహా) జర్నలిస్టులూ అవకాశందొరికితే/దొరకబుచ్చుకునీ బిజెపిని దుమ్మెత్తిపోస్తున్నారు. ఒక విధంగా తెలుగుదేశం రైతులకు చేసిన దగాకంటే, బిజెపి మాటతప్పి చేసిన మోసం చిన్నదే.
ఎలాగైనా అధికారంలోకి ఎక్కెయ్యడానికి రుణమాఫీ అని చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ కు పెద్దకొడుకునని నరేంద్రమోదీ పర్యావసానాలు ఆలోచించని మాటలు అన్నందుకు రైతులూ, ప్రజలూ వారిని (ప్రస్తావన వస్తే తిట్టుకోవడం మినహా) పల్లెత్తు మాటకూడా అనకపోవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియడం లేదు. 
భూదేవి సహనమంటే ఇదేనా? నడిసముద్రంలో నిస్సహాయత ఇదేనా? ఇదే మానొసటిరాత అనే నిర్లిప్తత గానా? 
కానీ, ఒకటి ముమ్మాటికీ నిజం…ఆగ్రహంగా, ఆక్రోశంగా మారని కష్టం బాధితులను మరింత దుఖపెడుతుంది! చేయనితప్పుకి శిక్షపడినపుడు నిందించడానికో శాపనార్ధాలు పెట్టడానికో ఎవరూ లేకపోవడమంతటి కష్టం మరొకటి వుండదు!!