గోదావరిలో నీటి ఎద్దడి 


  
గోదావరి డెల్టాలో రెండో పంటకు నీటి ఎద్దడి పదమూడేళ్ళనాటి తీవ్రతకు మించి వుండగలదని ఇరిగేషన్ ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. ఇది కనీసం మూడువేల కోట్లరూపాయల వ్యవసాయిక ఆర్ధిక వ్యవస్ధను ప్రభావితం చేస్తుంది. అయితే తక్కువ నీటితోనే ఎక్కువ దిగుబడులు సాధించి చరిత్రను తిరగ రాయాలని రైతులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాజెక్టు కమిటీ భావిస్తోంది. కమిటీ, ఇరిగేషన్ శాఖ సంయుక్తంగా రైతుల్ని ఏమేరకు మోటివేట్ చేయగలరు అన్నదాన్ని బట్టే ధాన్యాగారమైన గోదావరిజిల్లాల్లో రెండో పంట స్ధితీగతీ వుంటాయి.
http://www.telugu360.com/te/godavari-deltas-in-water-crisis/

నీళ్ళు వచ్చేశాయి


ఇప్పటికిప్పుడే నీళ్ళు చాలవని తెలిసికూడా పట్టిసీమ ఎత్తిపోతల పధకాన్ని ఒకసారి జాతికి అంకితంగా, మరోసారి ఇబ్రహీంపట్టణం వద్ద సభగా, ఆవెంటనే పట్టిసీమవద్ద ప్రారంభోత్సవంగా…మొత్తం మీద అనేక ఈవెంట్ల మెగా ఈవెంటుగా ముఖ్యమంత్రి ఎందుకు మార్చేస్తున్నారన్నది సూటిగా సమాధానం దొరకని ప్రశ్న. 

ఇతరవిషయాలు ఎలా వున్నా “నీళ్ళు వచ్చేశాయి” అన్న భారీ ప్రచారం రాజధాని ఏరియా అంతటా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పెద్ద ఊపునిస్తుంది.

అనుసంధానం ఘనత బాబుదే! తక్షణ ప్రయోజనం ఎవరికి ?

  

పండిన సార్వావరిని మెత్తగా కోసుకోడానికే మంచు కురుస్తూందేమో!


ఏపనైనా కాంటా్రక్టే అనేటంతగా చేనుకీ రైతుకీ రైతుకూలీకీ మధ్య జీవనవిధానం రూపాయల బంధంగా మారిపోయింది. కోతకోసి, పనలుకట్టి, కుప్పవేసి, నూర్చి, తూర్పారబట్టి, సంచులకెత్తి, ధాన్యాన్ని ఒబ్బిడి చేసే పనుల్లో శ్రీకాకుళం జిల్లానుంచి వచ్చిన కూలీలే ఎక్కువగా వున్నారు. ఇతరవ్యాపకాలకు తరలిపోతూండటంవల్ల గోదావరి తూర్పు డెల్టాలో వ్యవసాయకూలీల కొరత ఏటేటా పెరిగిపోతోంది.

దాదాపు ఐదులక్షల ఎకరాల్లో వేసిననాట్లలో జూలైవానలకు నలభైశాతం పోతే మళ్ళీవేశారు, ‘నెలతక్కువపైరు’ లో 60 శాతం సెప్టంబరు వానలకు కుళ్ళిపోయింది.అప్పుడు మిగిలిన పైరు పంటై ఇపుడుకోతకు వచ్చింది. 1030 రూపాయల మద్ధతు ధర ప్రకటించినా 730 కి మించి ధర రైతుచేతి కందడమే లేదు.

వరికోతలు image చదువుకున్న రైతమ్మ image image image image image image తూరపారబట్టడం image తూరపారబట్టడం image image వరికోతలు తూరపారబట్టడం image image image పండిన ధాన్యం తూరపారబట్టడం వరికోతలు