పుష్కరాల్లో 5 వరోజున రాజమండ్రి బస్ స్టాండ్ లో బస్సుల రాక, పోక లేక గంటల తరబడి ప్రయాణీకులు నరకయాతన పడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత రాత్రి 2 నుంచి ఐదున్నర వరకూ అక్కడే వుండి ప్రతి రెండు నిమిషాలకు ఒక బస్సు వెళ్ళిపోయేలా దిద్దుబాటు చేశారు.
ఇది వేలాది మంది యాత్రికులకు ఊరటే…ఈ పని చేయడానికి ముఖ్యమంత్రే స్వయంగా తరలి రావాల?
అలా అయితే రాజమండ్రిలో కేంపు చేసివున్న 30 వేలమంది పోలీసులు, 20 వేల మంది ఉద్యోగులు, పదిమంది మంత్రులు, ఆయా శాఖల సెక్రెటరీలు, కమీషనర్లు, 24 గంటలూ కెమేరాలు పనిచేసే కంటో్రలు రూములు ఏం చేస్తున్నట్టు?
ఇంత మందీ మార్బలం పనికిమాలింది అనుకోవాలా? అధినాయకుడు సవయంగా రంగంలో దిగితే తప్ప కదలని తుప్పుపట్టిపోయిన యంతా్రంగమనుకోవాలా? ప్రతీసారీ నాయకుడే దిగిరావడం సాధ్యమేనా? సాధ్యమే అనుకుంటే ఇలాంటి బృదం ప్రత్యక్షంగా నాయకుడికి పరోక్షంగా ప్రజలకి భారం కాదా???
టీమ్ తో పనిచేయకుండా తానే పని చేయడం నాయకుడి లక్షణమా?
నిపుణుడి లక్షణమా?