ప్రస్తుతానికి మనకి పనికిరాని ఈ అభివృద్ది మోడల్ ని వదిలేసి ఆర్ ఎస్ ఎస్ సూచించినట్టు భారతీయ నమూనా ను సిద్ధం చేసుకోవడమే ఉత్తమం…కాని పక్షంలో ”సస్టెయిన్ బుల్ మేక్ ఇన్ ఇండియా” దాదాపు అసాధ్యమే!
హుదూద్’ ఇళ్ళు కట్టలేదు సరే! 260 కోట్ల విరాళాలు ఏమయ్యాయి మరి?
ఉత్తరాంధ్ర, విశాఖ నగర రూపురేఖలను చిన్నాభిన్నం చేసిన ప్రచండ తుపాను ‘హుదూద్’ ప్రాంతాల పునర్నిర్మాణం మొదలుకాలేదు. బాధితుల సహాయ, పునరావాసాలపై ప్రభుత్వం హామీలు నెరవేరలేదు. ఒక్క పటిష్ట, శాశ్వత చర్య కూడా లేదు.తుపానుకి చితికపోయిన విశాఖ మురికివాడలను, మత్స్యకార ప్రాంతాలను చూస్తే ప్రచారంలోని డొల్లతనం ప్రత్యక్షమౌతుంది.
http://www.telugu360.com/te/no-rehabilitation-even-after-1-year-hudhud/
హోదా పై మాయమాటలు వొద్దు !
హోదా” సంజీవనీ మంత్రం కాదని వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు గట్టిగా నమ్ముతూవుండి వుండవచ్చు. ”పెద్దకొడుకునై ఆంధ్రప్రదేశ్ కష్టం తీరుస్తా” అని తిరుపతి సభలో నమ్మబలికి అధికారం ఎక్కాక మూగనోము పట్టిన నరేంద్రమోదీ నమ్మకం కూడా అదే అయివుండవచ్చు. కానీ, ప్రత్యేక హోదా మాత్రమే ఆంధ్రప్రదేశ్ ను గట్టెక్కించగలదని విద్యావంతులు, ఆలోచనాపరులు, మేధావులు, రాజకీయాలతో సంబంధం లేని తటస్ధవాదులు నమ్ముతున్నారు. వైఎస్ జగన్ మోహన రెడ్డిని వ్యతిరేకించే వారు కూడా ఆయన నిరాహార దీక్షను శ్రద్ధాసక్తులతో పరిశీలిస్తూ వుండటమే ఇందుకు పెద్ద సాక్ష్యం.
http://www.telugu360.com/te/special-status-the-rescue-mantra-for-ap/
ఆదిలోనే హంసపాదు
ఏడాదిలోకావలసిన పనులను ఆరునెలలలోనే గొంతు మీద కూర్చుని పూర్తి చేయించిన అనర్ధమే ఇదని జలవనరులశాఖలో సిబ్బందిని ఎవరిని కదిలించినా తిట్టుకుంటున్నారు
http://www.telugu360.com/te/river-interlinking-aqueduct-breaches-within-hours-of-launch/
నీళ్ళు వచ్చేశాయి
ఇప్పటికిప్పుడే నీళ్ళు చాలవని తెలిసికూడా పట్టిసీమ ఎత్తిపోతల పధకాన్ని ఒకసారి జాతికి అంకితంగా, మరోసారి ఇబ్రహీంపట్టణం వద్ద సభగా, ఆవెంటనే పట్టిసీమవద్ద ప్రారంభోత్సవంగా…మొత్తం మీద అనేక ఈవెంట్ల మెగా ఈవెంటుగా ముఖ్యమంత్రి ఎందుకు మార్చేస్తున్నారన్నది సూటిగా సమాధానం దొరకని ప్రశ్న.
ఇతరవిషయాలు ఎలా వున్నా “నీళ్ళు వచ్చేశాయి” అన్న భారీ ప్రచారం రాజధాని ఏరియా అంతటా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పెద్ద ఊపునిస్తుంది.
కార్యకర్తల పునాదితోనే వారసుడికి నాయకత్వం!
…..చంద్రబాబు నాయుడు అనుచరులుగా సహచరులుగా వున్న నాయకులు అదే విధేయతను నారా లోకేష్ పట్ల చూపించడంలో పెద్ద ఇబ్బంది వయోబేధమే! క్రమంతప్పని తెలుగుదేశం సభ్యత్వాల నమోదు కొత్తతరం కార్యకర్తల్ని పార్టీలోకి తీసుకు వస్తుంది.వీరందరికీ నిరంతరాయంగా సిద్ధాంతపరమైన శిక్షణ, ఇచ్చేలా తెలుగుదేశం కార్యక్రమాన్ని రూపొందించింది. ఈఫలితాలు నాలుగైదేళ్ళలో లోకేష్ కు తిరుగులేని మద్దతుగా నిలుస్తాయి….
ఇది గౌరవభంగం కూడా…
పార్లమెంటులో ప్రశ్నించడానికీ, ప్రభుత్వంలో ప్రస్తావించడానికీ వీలులేకుండా ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం దయాదాక్షిణ్యాల ఫైలు లో విభజన హక్కుల్ని కుడా కూరేసి చంద్రబాబు చూస్తూండగానే ప్రధాని చైర్మన్ గా వున్న నీతిఆయోగ్ కాళ్ళకిందికి తోసేశారు…..
http://www.telugu360.com/te/ap-right-is-now-at-neethi-ayoogs-mercy/
రెండు రాషా్ట్రల సగటు మనిషిదీ ఒకటే హృదయం
రెండు రాషా్ట్రల సగటు మనిషిదీ ఒకటే హృదయం
(శనివారం నవీనమ్)
తన జీవితంలో ఎన్నో అంశాలను పరిశీలించి, పరిష్కరించానని, అయితే మనం దేశ,విదేశాల్లో ఎవరితో మిత్రుత్వం, శత్రుత్వం చేయాలో నిర్ణయించుకోవచ్చుగానీ, మన పక్కన వుండే వారిని నిర్ణయించుకోలేమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. కాబట్టి ఇష్టం ఉన్నా లేకున్నా…కలిసి బ్రతకాల్సిందేనని, అందరూ కలిసి దేశాభివద్ధికి దోహదం చేయాల్సిందేనని అదే చరిత్ర చెప్పిన పాఠమని నిన్న హైదరాబాద్ లో ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన చేసిన వ్యాఖ్యానాలు చంద్రబాబునాయుడు, కెసిఆర్ ప్రభుత్వాలను ”చెంపలు వాయించుకుని గుంజీలు తీయాలని” పెద్దమనిషి ప్రేమతో మందలించినట్టుగా వున్నాయి.
కెసిఆర్ ఆంధ్రానాయకుల్ని లత్కోర్లు, లఫంగీలు అని హేళన చేసినా…నన్ను టచ్ చేస్తే తెలంగాణా ప్రభుత్వానిక అదే ఆఖరురోజని చంద్రబాబు ఊగిపోయినా ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణా ప్రజలుగాని ఆవేశాలతో రెచ్చిపోలేదు. టిఆర్ఎస్, తెలుగుదేశం పార్టీలు వాటివాటి వైరాల్ని, గొడవల్ని ప్రజలకు పులిమే ప్రయత్నాలు చేస్తున్నా వాటిని అంటించుకోని రెండు రాషా్ట్రల ప్రజల సామరస్యం, వివేకం, ఇంగితం తెలుగురాషా్ట్రల్లో సగటు మనిషి కొండంత ఎత్తున నిలిపివుంచింది.ఇదే స్పూర్తిని రాష్ట్రపతి మాటల్లోకి మార్చారా అనిపిస్తోంది.
హైదరాబాదు తెలంగాణలో భాగంగా రాజధానిగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం జరిగే లోగా పదేళ్లకు మించకుండా హైదరాబాదు నుంచే పాలన సాగించాలి గనక ఉత్పన్నమైన ప్రత్యేక నిబంధనల అధ్యాయమే సెక్షన్ 8 . రాజ్యాంగం ప్రకారం గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ సలహాల ప్రకారమే నడుచుకోవాలి. తెలంగాణ ప్రభుత్వానికీ అదే సూత్రం వర్తిస్తుంది. హైదరాబాద్లో ఆంధ్రప్రదేశా పరభుత్వం కూడా నివాసముంటోంది.దీనిపై మరో రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీ చేసే అవకాశముండదు. కనుక మధ్యంతర దశలో గవర్నర్కు కొన్ని ప్రత్యేక బాధ్యతలు అప్పగించడమే ఆ సెక్షన్ ఉద్దేశం. ఆ ప్రకారం గవర్నర్ …భవనాల కేటాయింపు…పౌరుల, ప్రధాన సంస్థల భద్రతకు సంబంధించి పర్యవేక్షణ చేయవలసి ఉంటుంది. ఇందుకోసం కేంద్రం ఆయనకు ఇద్దరు సలహాదార్లను నియమి స్తుంది. తెలంగాణ మంత్రివర్గంతో సంప్రదిస్తూ దాని సలహాల మేరకు గవర్నర్ పనిచేస్తారు. అయితే ఎప్పుడైనా ఆయన గనక ఆ ప్రభుత్వ నిర్ణయాలతో విభేదిస్తే అప్పుడు ఆయన విచక్షణాధికారమే అంతిమమవుతుంది.
ఈ సెక్షన్ ఇప్పటి వరకూ అమలు జరిగిందా, లేదా అంటే ఏదో మేరకు అమలు జరుగుతూనే ఉంది. భవనాల కేటాయింపు, వాహనాల కేటాయింపు వంటివి ఆయన ఆధ్వర్యంలోనే జరిగాయి. ఐఎఎస్, ఐపిఎస్ అధికారులే గాక మంత్రులూ, ముఖ్యమంత్రులూ కూడా ఆయనతో తరచూ సమావేశమవుతున్నారు. నాగార్జున సాగర్ డ్యాంపై పోలీసుల ఘర్షణ, ఎన్జీవోల కార్యాలయంలో ఘర్షణ వంటివి జరిగినప్పుడు ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడారు. ముఖ్యమంత్రులతో నూ సంప్రదించారు. విద్యా సంబంధ మైన విషయాల పైనా ఇరు రాష్ట్రాల మంత్రులూ ఆయనతో సమావేశమై అవగాహనకు వచ్చారు. ఇవన్నీ స్థూలం గా సెక్షన్ 8 పరిధిలోవే.
కాకపోతే అమలు కాని అంశం ఒకటుంది. ఈ సెక్షన్ అమలుకు నిబంధనల పేరిట కేంద్రం ఒక లేఖ రాసింది. అందులో పోలీసు కమిషనర్ల నియామకం వంటివి కూడా గవర్నర్ సలహాల మేరకు జరగాలన్నట్టు పేర్కొంది. దానిపై తెలంగాణ అభ్యంతరం తెల్పడంతో పక్కన పెట్టారు. దాన్ని ఉపసంహరించాలని ఆ ప్రభుత్వం గాని అమలు చేయాలని ఎపి ప్రభుత్వం గాని ఎప్పుడూ గట్టిగా అడిగింది లేదు. ఇప్పుడు రాజకీయ ఇరకాటంలో చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రులు దీన్ని పైకి తీశారు. తమ ప్రభుత్వాధినేతకే రక్షణ లేదు గనక స్వంత రాష్ట్ర పోలీసులను తెచ్చుకుంటామనీ, సరిగ్గా వారిపై ప్రతి వ్యూహ ప్రయోగం కోసం కెసిఆర్ ఆయన అనుయాయులు అసలా ఊసే ఒప్పుకోబోమని వాదించారు.
చెప్పాలంటే ఇదంతా కృత్రిమమైన వ్యవహారం. పైగా ఈ క్రమంలో హైదరాబాదు శాంతిభద్రతలు పదే పదే చర్చకు రావడం రెండు రాష్ట్రాలకూ మంచిది కాదు. చంద్రబాబు నాయుడు ఢిల్లీలో సమర్పించిన ఒక పత్రంలో దాడులు జరుగుతున్నట్టు పేర్కొన్నారు. కొన్ని రకాలైన ఒత్తిళ్లు, అపార్థాలు ఉన్నా ప్రభుత్వ స్థాయిలో ఫిర్యాదు చేయాల్సినంత తీవ్ర పరిస్థితి హైదరాబాదులో లేదనేది వాస్తవం.
ప్రధానంగా ఉద్యోగ కేంద్రాలలోనూ, అధికారుల బదలాయింపులోనూ, విద్యా సంస్థల పరీక్షలు, సీట్ల కేటాయింపులలోనూ, నీటి పంపిణీ లోనూ వివాదాలు వచ్చిన మాట, కొనసాగుతున్న మాట కాదనలేనిది. అయితే ఇందుకు బాధ్యత ప్రభుత్వాలది తప్ప ప్రజలది కాదు. వారి మధ్య ఘర్షణలు వచ్చిందీ లేదు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పారిశ్రామికవేత్తల సదస్సుకు ఆంధ్రప్రదేశ్ హేమా హేమీలంతా వచ్చారు. అమరావతి నిర్మాణంలో భాగం కోసం తెలంగాణకు చెందిన సంస్థలూ ఉవ్విళ్లూరుతున్నాయి. ఎటొచ్చి తెలుగుదేశం, టిఆర్ఎస్ల రాజకీయ వైరమే పరిస్థితిని ఉద్రిక్తం చేసింది.
గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల కోణంలో ఉన్న టిఆర్ఎస్ కూడా అందుకు తగినట్టే స్పందించింది. సెక్షన్ 8ని గుర్తిస్తాము గాని దాన్ని అమలు చేయాల్సిన పరిస్థితులు లేవని తెలంగాణ సర్కారు అంటుంది. ఆ పరిస్థితులు ఉన్నాయా, లేదా అని నిర్ణయించు కోవలసింది గవర్నరే. ఇక ఎపి విషయానికి వస్తే ఈ సెక్షన్లో దాని ప్రస్తావనే లేదు.
గవర్నర్ సంప్రదించాల్సింది తెలంగాణ సర్కారును తప్ప ఎపిని కాదు. కాకపోతే ఏమైనా ఫిర్యాదులు, విజ్ఞప్తులు ఉంటే స్వీకరించి నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది.
అతి సామాన్య ప్రజలకు ఈ వివరాలన్నీ తెలిసి వుండకపోవచ్చు. అయితే ఏవివాదంలోనైనా, ఏ కీలకాంశంలోనైనా ప్రజల ప్రయోజనాలు ఎంత, పార్టీల లాభమెంత అని బేరీజువేసుకునే ఇంగితజ్ఞానం వున్న తెలుగు మనిషీ వర్ధిల్లు !
కెసిఆర్ దూకుడు – సెక్షన్ 8 అడ్డుకట్ట! (శనివారం నవీనమ్)
ఓటుకినోటు కేసులో న్యూస్ టివిల బ్రేకింగ్ న్యూస్ లు ఆగిపోయాయి. తెలంగాణా పాలకపక్షమైన టిఆర్ఎస్ నుంచి మీడియాకు లీకులు ఆగిపోవడమే ఇందుకుమూలం. తెలుగుదేశం అధినేత పట్ల చర్యతీసుకునే విషయంలో టిఆర్ఎస్ అధిష్టానం ఆలోచనలు మారుతున్నాయనే ఈ పరిణామాల్ని అర్ధం చేసుకోవాలి.
ప్రతియాక్షన్ కీ రియాక్షన్ వుంటుందన్న సూత్రం భౌతికశాస్త్రం లో ప్రత్యక్షంగా కనిపించదేమోకాని రాజకీయశాస్త్రంలో అడుగడుగునా ఎదురౌతూనే వుంటుంది.
ఉద్యమకాలం నుంచీ కూడా ఆంధ్రోళ్ళపార్టీ అనిప్రచారంచేస్తూ తెలంగాణా ప్రజల్లో తెలుగుదేశం మీద ఈసడింపు, ద్వేష భావాలను టిఆర్ఎస్ నూరిపోసింది. చంద్రబాబుకి ఏమాత్రమూ రాజకీయ అవకాశాన్ని మిగల్చకూడదన్న దిశగానే కెసిఆర్ మొదటినుంచీ వ్యవహరిస్తున్నారు. ఇందుకు లభించిన ఏ అవకాశాన్నీ ఆయన ఎన్నడూ వొదులుకోలేదు. యాభైలక్షల అడ్వాన్సు ఇచ్చిన వలలో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారు. తరువాత పరిణామాలు రెండు రాషా్ట్రల్లోనూ ఉద్విగ్న భరితమైన వాతావరణం ఏర్పడింది. వేడిచల్లారే కొద్దీ న్యాయమీమాంసలు తలఎత్తడం మొదలైంది.
లేని ఉద్దేశాన్ని ప్రేరేపించి నేరానికి పాల్పడేలా ఉచ్చులోకి లాగే స్టింగ్ ఆపరేషన్ న్యూస్ టివిల సంచలనాలకు సరే! ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకు కూడానా?
ఇది చట్టబద్దమేనా? అయితే ఇలాగే సిబిఐ స్టింగ్ ఆపరేషన్ లో దొరికిన కేంద్రమంత్రి దిలీప్ సింగ్ జుదేవో కేసును 2003 లో సుప్రీంకోర్టు ఎందుకు కొట్టేసింది?
మరి ఎబిసి పని టా్రప్ లోకి లాగేసి పట్టుకోవడమే కదా? అయితే ఏరాష్ట్రముఖ్యమంత్రి మీదైనా ఒక రాష్ట్రపు ఎబిసి వలపన్న వచ్చునా? రేవంత్ రెడ్డి అనే ప్రొటోకాల్ లేని వ్యక్తిమీద విసిరిన వల ఆధారంగా ముందుకి సాగిపోయినపుడు అనుకోకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అందులో తగులుకున్నారా ?
ఏంజరిగిందో అందరికీ తెలుసు…కెసిఆర్ రాజకీయ ఉద్దేశాలతోనే వల వేశారు. చంద్రబాబు అందులో చిక్కుకున్నారు..బాబుకి దేశవ్యాప్తంగా పెద్ద డామేజీ జరిగింది. అయితే చట్టపరమైన సాంకేతిక అంశాలను బట్టే కేసునుంచి బయటికి రావడమో, ఇరుక్కుపోవడమో వుంటుంది.
చంద్రబాబుకి జరిగిన డామేజి మేరకు కెసిఆర్ కి సొంతరాష్ట్రంలోగాని దేశవ్యాప్తంగా కాని అదనపు ప్రతిష్టపెరగలేదు. బాహాటంగా మద్దతు ఇవ్వలేకపోయినా కెసిఆర్ సహా అందరూ చేస్తున్న ”కొనుగోళ్ళే” గనుక రాజకీయవర్గాల్లో బాబు పట్ల సానుభూతి పెరిగింది.
అయితే ఆంధ్రులమీద ఇప్పటికే తెలంగాణాలో విజయవంతంగా నూరిపోసిన ద్వేషం మరోసారి ఆ ప్రాంతంలో ఉద్వేగపూరితమైన విజయంలా పరిణమించింది. దానికి రియాక్షన్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉక్రోషపూరితమైన ఉద్వేగంగా మారింది.
అయితే దీనినుంచి తెలుగుదేశం తేరుకుంది. ఫోన్ టాపింగ్ లో అడ్డంగా దొరికపోయున తెలంగాణా ప్రభుత్వంలో బాధ్యుల్ని కేంద్రంముందు నిలబెట్టదలచారు. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ లో శాంతిభద్రతల అదుపు అధికారాలు గవర్నర్ కి అప్పగించాలన్న 8 వ సెక్షన్ అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు.
హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ గవర్నర్ చేతుల్లోకి వెళ్ళిపోయి ఉత్సవమూర్తిగా మిగిలిపోవడం కెసిఆర్ కే కాదు ఏ ముఖ్యమంత్రికీ ఇష్టం వుండదు. ఇందువల్లే ఈ కేసులో ”తనపని తానే చేసుకుపోయే చట్టం” దూకుడు తగ్గించిందని అర్ధమౌతూంది.
రాజకీయాల్లో ఆధిపత్యాల సాధనకు రాజకీయప్రక్రియలనే అనుసరించడం క్రీడాధర్మం…కెసిఆర్ ఆటను మార్చారు…అవినీతిని బయటపెట్టడానిక అధికారాన్ని చట్టాన్నీ వాడారు. ఆయన అవినీతి మచ్చేలేని గాంధీజీ అయివుంటే, అన్నాహజారే అయివుంటే రేవంత్ రెడ్డిని రెడ్ హాండెడ్ గా పట్టుకున్నందుకు ఆయన ప్రభుత్వం కీర్తప్రతిష్డలు ఉవ్వెత్తున ఎగిసివుండేవి. అయితే ఈ వ్యవహారమంతా ఒకే తానులో గుడ్డ అయివుండి అదే గుడ్డలో చిరుగుల్ని మరకల్ని మాసికల్ని చూపించి ఎగతాళి చేస్తున్నట్టు వుంది.
మొదట ఉక్రోషపడిన చంద్రబాబు రాజకీయప్రక్రియద్వారానే దాదాపుగా ప్రత్యర్ధి దూకుడికి అడ్డుకట్ట పడే ఎత్తుగడలతో ముందుకుపోతున్నారు.
రాజకీయాల్ని రాజకీయాలతో ఎదుర్కోవాలి…చట్టాల్ని చట్టాలతోటీ, ప్రభుత్వాల్ని ప్రభుత్వాలతోటీ ఎదుర్కోవాలి. కెసిఆర్ ఆటనియమాన్ని మార్చే ప్రయత్నంలో వున్నారు. రాజకీయప్రత్యర్ధి తెలుగుదేశాన్ని అధికారంతో కట్టడి చేయాలనుకున్నారు. చాలావరకూ సఫలమయ్యారు కూడా! బయటపడటానికి తెలుగుదేశం రాజకీయప్రక్రియనే చేపట్టింది. ఉమ్మడి రాజధాని కనుక హైదరాబాద్ లో శాంతి భద్రతలు గవర్నర్ క అప్పగించాలని కేంద్రాన్ని కోరింది. ఇది తెలుగుదేశం వొళ్ళుకాచకునే కవచం మాత్రమే కాదు, ప్రత్యర్ధి టిఆర్ఎస్ ని అడుగుముందుకి పడనివ్వకుండా ఆపేసే ఆయుధం కూడా!
ఎత్తులు పై ఎత్తుల రాజకీయాలు సరే! రెండు రాషా్ట్రల మధ్య ఉద్వేగాలు సరే!
ప్రజాప్రతినిధులను పార్టీలు కొనుక్కోవడమనే దుర్నీతికి ఇలాంటి పరిణామాల వల్ల, ఉద్విగ్నభరితమైన ప్రజామోదం లభించడమే అత్యంత విషాదం!
ఓటు నోటు రగడఒక పౌరుడి స్పష్టీకరణ
నోటుకి ఓటు తగాదాలో ” ఇది తనను ఎన్నుకున్న 5 కోట్లమందినీ అవమానించడమే” నన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయంతో నాకు సంబంధం లేదనీ, ఆ అభిప్రాయంతో విభేదిస్తున్నాననీ స్పష్టం చేస్తున్నాను.
ముఖ్యమంత్రి ప్రస్తావించిన కోట్లమందిలో నేనూఒకడిని అయివున్నందున ఈ వివరణ ఇవ్వవలసి వచ్చింది. కాంగ్రెస్ ఏకపక్షంగా విభజించిన రాష్ట్రంలో నేను నివశిస్తున్న ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేస్తారన్న ఆశతో తెలుగుదేశం బిజెపి కూటమికి నేను ఓటు వేసిన మాట వాస్తవమే ఆదేవిధంగా నాబంధుమిత్రులను ప్రోత్సహించిన మాటా నిజమే!
ఓటూ నోటూ తగాదాలో పట్టుబడిపోయిన తెలుగుదేశం మీద కోపమేమీలేదు…ఓట్లు కొనిగెలవగల గెలుపుగుర్రాలనే (మనుషులు కారన్నట్టు) అన్నిపార్టీలూ పోటీకి నిలుపుతున్నపుడు టిఆర్ఎస్ నుంచో, తెలుగుదేశం నుంచో నీతినియమాలను ఆశించే పరిస్ధితిలేదు.
నానారకాల ఆకర్షణలతో కెసిఆర్ కట్టుబాటుని తెగ్గొట్టారు. డబ్బెట్టి అదేపనిచేయబోయిన చంద్రబాబు దొరికిపోయారు. దీనినుంచి బయటపడటం ఆయన సమస్య, ఆయన పార్టీ సమస్య. చంద్రబాబు ఏదో ఉక్రోషపుఫ్లోలో అనేసినట్టు ఇది ఐదుకోట్ల మంది ప్రజల విషయం కానేకాదు. ఆప్రజల్లో నేనుకూడా ఒకడిని అయి వున్నందువల్ల ఈ ప్రకటన చేయవలసివస్తోంది.
కెసిఆర్ చర్య చట్టవిరుద్దమూ అన్యాయమూ అయితే తెలుగుదేశంవారు ఉద్యమాలు సత్యాగ్రహాలు చేసి జైళ్ళునింపేసి ప్రజల సానుభూతి మద్దతు కూడగట్టుకోవచ్చుకదా!
టివిల్లో అరచిపెడబొబ్బలు పెడుతున్న తెలుగుదేశం నాయకుల మాటలు యాక్షన్ సినిమాల్లో ఈలలు, కేకలుగానే కనబడుతున్నాయి. వీటివల్ల ఏప్రయోజనమూ వుండదు. సినిమా అయిపోగానే వెళ్ళిపోయే ప్రేక్షకులకు, టివికేమేరా మూసుకుపోగానే బట్టలు సవరించుకువెళ్ళిపోయే ఈ నాయకులకూ తేడావుండదు. పైగా అవాకులూ చెవాకులు మనకి బోనస్. తనను అరెస్టు చేస్తే తెలంగాణా ప్రభుత్వానికి అదే ఆఖరిరోజని స్వయంగా ముఖ్యమంత్రే ఆవేశపడిపోయాక, ఆయన సేన ఎన్ని కుప్పిగంతులైనా వేస్తుంది మరి.
దొరికేవరకూ అందరూ దొంగలే! ఓటు నోటు రగడవల్ల ఒక ముఖ్యమంత్రే గిలగిలలాడిపోవలసివచ్చిన ప్రజాస్వామిక స్ఫూర్తిని నిలిపే చట్టాల్ని స్వాగతిస్తున్నాను