రెండు రాషా్ట్రల సగటు మనిషిదీ ఒకటే హృదయం


రెండు రాషా్ట్రల సగటు మనిషిదీ ఒకటే హృదయం

(శనివారం నవీనమ్)
తన జీవితంలో ఎన్నో అంశాలను పరిశీలించి, పరిష్కరించానని, అయితే మనం దేశ,విదేశాల్లో ఎవరితో మిత్రుత్వం, శత్రుత్వం చేయాలో నిర్ణయించుకోవచ్చుగానీ, మన పక్కన వుండే వారిని నిర్ణయించుకోలేమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. కాబట్టి ఇష్టం ఉన్నా లేకున్నా…కలిసి బ్రతకాల్సిందేనని, అందరూ కలిసి దేశాభివద్ధికి దోహదం చేయాల్సిందేనని అదే చరిత్ర చెప్పిన పాఠమని నిన్న హైదరాబాద్ లో ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన చేసిన వ్యాఖ్యానాలు చంద్రబాబునాయుడు, కెసిఆర్ ప్రభుత్వాలను ”చెంపలు వాయించుకుని గుంజీలు తీయాలని” పెద్దమనిషి ప్రేమతో మందలించినట్టుగా వున్నాయి. 
కెసిఆర్ ఆంధ్రానాయకుల్ని లత్కోర్లు, లఫంగీలు అని హేళన చేసినా…నన్ను టచ్ చేస్తే తెలంగాణా ప్రభుత్వానిక అదే ఆఖరురోజని చంద్రబాబు ఊగిపోయినా ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణా ప్రజలుగాని ఆవేశాలతో రెచ్చిపోలేదు. టిఆర్ఎస్, తెలుగుదేశం పార్టీలు వాటివాటి వైరాల్ని, గొడవల్ని ప్రజలకు పులిమే ప్రయత్నాలు చేస్తున్నా వాటిని అంటించుకోని రెండు రాషా్ట్రల ప్రజల సామరస్యం, వివేకం, ఇంగితం తెలుగురాషా్ట్రల్లో సగటు మనిషి కొండంత ఎత్తున నిలిపివుంచింది.ఇదే స్పూర్తిని రాష్ట్రపతి మాటల్లోకి మార్చారా అనిపిస్తోంది.
హైదరాబాదు తెలంగాణలో భాగంగా రాజధానిగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని నిర్మాణం జరిగే లోగా పదేళ్లకు మించకుండా హైదరాబాదు నుంచే పాలన సాగించాలి గనక ఉత్పన్నమైన ప్రత్యేక నిబంధనల అధ్యాయమే సెక్షన్ 8 . రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌ రాష్ట్ర ప్రభుత్వ సలహాల ప్రకారమే నడుచుకోవాలి. తెలంగాణ ప్రభుత్వానికీ అదే సూత్రం వర్తిస్తుంది. హైదరాబాద్లో ఆంధ్రప్రదేశా పరభుత్వం కూడా నివాసముంటోంది.దీనిపై మరో రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీ చేసే అవకాశముండదు. కనుక మధ్యంతర దశలో గవర్నర్‌కు కొన్ని ప్రత్యేక బాధ్యతలు అప్పగించడమే ఆ సెక్షన్‌ ఉద్దేశం. ఆ ప్రకారం గవర్నర్‌ …భవనాల కేటాయింపు…పౌరుల, ప్రధాన సంస్థల భద్రతకు సంబంధించి పర్యవేక్షణ చేయవలసి ఉంటుంది. ఇందుకోసం కేంద్రం ఆయనకు ఇద్దరు సలహాదార్లను నియమి స్తుంది. తెలంగాణ మంత్రివర్గంతో సంప్రదిస్తూ దాని సలహాల మేరకు గవర్నర్‌ పనిచేస్తారు. అయితే ఎప్పుడైనా ఆయన గనక ఆ ప్రభుత్వ నిర్ణయాలతో విభేదిస్తే అప్పుడు ఆయన విచక్షణాధికారమే అంతిమమవుతుంది.
ఈ సెక్షన్‌ ఇప్పటి వరకూ అమలు జరిగిందా, లేదా అంటే ఏదో మేరకు అమలు జరుగుతూనే ఉంది. భవనాల కేటాయింపు, వాహనాల కేటాయింపు వంటివి ఆయన ఆధ్వర్యంలోనే జరిగాయి. ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారులే గాక మంత్రులూ, ముఖ్యమంత్రులూ కూడా ఆయనతో తరచూ సమావేశమవుతున్నారు. నాగార్జున సాగర్‌ డ్యాంపై పోలీసుల ఘర్షణ, ఎన్జీవోల కార్యాలయంలో ఘర్షణ వంటివి జరిగినప్పుడు ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడారు. ముఖ్యమంత్రులతో నూ సంప్రదించారు. విద్యా సంబంధ మైన విషయాల పైనా ఇరు రాష్ట్రాల మంత్రులూ ఆయనతో సమావేశమై అవగాహనకు వచ్చారు. ఇవన్నీ స్థూలం గా సెక్షన్‌ 8 పరిధిలోవే.

కాకపోతే అమలు కాని అంశం ఒకటుంది. ఈ సెక్షన్‌ అమలుకు నిబంధనల పేరిట కేంద్రం ఒక లేఖ రాసింది. అందులో పోలీసు కమిషనర్ల నియామకం వంటివి కూడా గవర్నర్‌ సలహాల మేరకు జరగాలన్నట్టు పేర్కొంది. దానిపై తెలంగాణ అభ్యంతరం తెల్పడంతో పక్కన పెట్టారు. దాన్ని ఉపసంహరించాలని ఆ ప్రభుత్వం గాని అమలు చేయాలని ఎపి ప్రభుత్వం గాని ఎప్పుడూ గట్టిగా అడిగింది లేదు. ఇప్పుడు రాజకీయ ఇరకాటంలో చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రులు దీన్ని పైకి తీశారు. తమ ప్రభుత్వాధినేతకే రక్షణ లేదు గనక స్వంత రాష్ట్ర పోలీసులను తెచ్చుకుంటామనీ, సరిగ్గా వారిపై ప్రతి వ్యూహ ప్రయోగం కోసం కెసిఆర్‌ ఆయన అనుయాయులు అసలా ఊసే ఒప్పుకోబోమని వాదించారు. 
చెప్పాలంటే ఇదంతా కృత్రిమమైన వ్యవహారం. పైగా ఈ క్రమంలో హైదరాబాదు శాంతిభద్రతలు పదే పదే చర్చకు రావడం రెండు రాష్ట్రాలకూ మంచిది కాదు. చంద్రబాబు నాయుడు ఢిల్లీలో సమర్పించిన ఒక పత్రంలో దాడులు జరుగుతున్నట్టు పేర్కొన్నారు. కొన్ని రకాలైన ఒత్తిళ్లు, అపార్థాలు ఉన్నా ప్రభుత్వ స్థాయిలో ఫిర్యాదు చేయాల్సినంత తీవ్ర పరిస్థితి హైదరాబాదులో లేదనేది వాస్తవం. 
ప్రధానంగా ఉద్యోగ కేంద్రాలలోనూ, అధికారుల బదలాయింపులోనూ, విద్యా సంస్థల పరీక్షలు, సీట్ల కేటాయింపులలోనూ, నీటి పంపిణీ లోనూ వివాదాలు వచ్చిన మాట, కొనసాగుతున్న మాట కాదనలేనిది. అయితే ఇందుకు బాధ్యత ప్రభుత్వాలది తప్ప ప్రజలది కాదు. వారి మధ్య ఘర్షణలు వచ్చిందీ లేదు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పారిశ్రామికవేత్తల సదస్సుకు ఆంధ్రప్రదేశ్‌ హేమా హేమీలంతా వచ్చారు. అమరావతి నిర్మాణంలో భాగం కోసం తెలంగాణకు చెందిన సంస్థలూ ఉవ్విళ్లూరుతున్నాయి. ఎటొచ్చి తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌ల రాజకీయ వైరమే పరిస్థితిని ఉద్రిక్తం చేసింది. 

గ్రేటర్‌ హైదరాబాదు ఎన్నికల కోణంలో ఉన్న టిఆర్‌ఎస్‌ కూడా అందుకు తగినట్టే స్పందించింది. సెక్షన్‌ 8ని గుర్తిస్తాము గాని దాన్ని అమలు చేయాల్సిన పరిస్థితులు లేవని తెలంగాణ సర్కారు అంటుంది. ఆ పరిస్థితులు ఉన్నాయా, లేదా అని నిర్ణయించు కోవలసింది గవర్నరే. ఇక ఎపి విషయానికి వస్తే ఈ సెక్షన్‌లో దాని ప్రస్తావనే లేదు. 
గవర్నర్‌ సంప్రదించాల్సింది తెలంగాణ సర్కారును తప్ప ఎపిని కాదు. కాకపోతే ఏమైనా ఫిర్యాదులు, విజ్ఞప్తులు ఉంటే స్వీకరించి నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది.
అతి సామాన్య ప్రజలకు ఈ వివరాలన్నీ తెలిసి వుండకపోవచ్చు. అయితే ఏవివాదంలోనైనా, ఏ కీలకాంశంలోనైనా ప్రజల ప్రయోజనాలు ఎంత, పార్టీల లాభమెంత అని బేరీజువేసుకునే ఇంగితజ్ఞానం వున్న తెలుగు మనిషీ వర్ధిల్లు !

కెసిఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు 💐


‘చార్మినార్ కి ఎప్పుడైనా ఇంత సున్నం కొట్టించారా ఏం కాగ్రెస్ వాళ్ళయ్యా’ అని
కెసి ఆర్ అన్నపుడు అవును కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం వస్తుందే తప్ప చార్మినార్ కీ కాంగ్రెస్ కి లంకె ఏమిటా అన్న ఆలోచనే మనకి రాదు ….

కెసిఆర్ గారు అంతటి మాటల మాంత్రికుడు.

భాష, సంస్కృతీ సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు తెలంగాణా ఉద్యమంలో పొదిగి ప్రపంచవ్యాప్తంగా వున్న తెలంగాణీయుల్లో భావసమైక్యతను సాధించిన అపూర్వ రాజకీయ నాయకుడు కెసిఆర్ గారే !

టివిలో ఆయన మాటలు మిస్ అవ్వను! ఆయన డబాయించేస్తున్నారని చాలా సార్లు తెలిసిపోతుంది. అయినా ఆ మాటలు వినబుద్ధి అవుతుంది

ఆయన బాగా చదివే మనిషి …అలాంటివాళ్ళంటే నాకు ప్రేమ, గౌరవం!

కెసిఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు 💐

వేర్పాటుకే పోరాటాలు సమైక్యతకు ఉద్యమాలుండవు 2తెలుగు రాషా్ట్రల్లో వచ్చే ఎన్నికలు!!


ప్రజల ఇష్టప్రకారం రాజ్యాలు ఏర్పడిన చరిత్ర ఒక్కటీలేదు.ఏచరిత్రలోనైనా యుద్ధాలు, సంధులే రాజ్యాల్ని సృష్టించాయి. హద్దుల్ని నిర్దేశించాయి. ఆధునిక ప్రజాస్వామ్యంలో కూడా అందుకు భిన్నమైన పరిస్ధితి వుండదు. ఇక్కడ యుద్దాలంటే వత్తిళ్ళే! సైనికులంటే నాయుల్ని అనుసరించే సహచరులు అనుచరులు కార్యకర్తలే ! కాంగ్రెస్ పదేళ్ళ నిర్ణయరాహిత్యం వల్ల /కాలయాపనవల్ల/ ఉదాసీనతవల్ల ఈ మూడింటి వల్లా వత్తిళ్ళు పెరిగి ఉద్వేగాలై ప్రజల్లోకి ప్రవహిస్తున్నాయి.

వేర్పాటుకే ఉద్యమాలూ పోరాటాలు వుంటాయితప్ప సమైక్యతకు అలాంటివి వుండే అవకాశమేలేదు. కెసిఆర్ తెలంగాణా సెంటిమెంటుని ప్రజల్లోకి తీసుకువెళ్ళారు. ఉద్యమాన్ని నిర్మించారు. ఆందోళనలు చేశారు. ప్రతీసారీ సీమాంధ్రనాయకులు వెటకారపు ఖండనలు, హేళనా పూర్వకమైన విమర్శలు, టివిల్లో ముచ్చట్లేతప్ప రాష్ట్రం కలసి వుండవలసిన అవసరాన్ని జనబాహుళ్యంలోకి తీసుకువెళ్ళే ప్రయత్నాలే చేయలేదు. ఇందువల్ల తెలంగాణా ప్రజల్లో రెండో ఆలోచనే లేకుండాపోయింది. అప్పటికే ఉద్వేగంతో వున్న తెలంగాణా వారికి సీమాంధ్ర నాయకుల ప్రకటనలు హేతుబద్ధతలేని నినాదాలుగా మాత్రమే కనిపిస్తున్నాయి. రాజకీయకార్యకర్తలు, పార్టీలు సంస్ధల కార్యకర్తలు, విద్యార్ధులు మినహా సామాన్య ప్రజలెవరూ సమైక్యాంధ్ర కోసం ఆందోళనల్లో పాల్గొనలేదు.

1969 తెలంగాణా ఉద్యమంలో ఆంధ్రులు 1972 జై ఆంధ్ర ఉద్యమంలో తెలంగాణావారూ మౌనంగానే వుండిపోయారు. ఇపుడూ దాదాపు అంతే…

అసలు రాష్టా్రలు విడిపోవడమో కలసివుండటమో ప్రజల ఇష్టప్రకారం జరగవు. వత్తిళ్ళే హద్దుల్ని నిర్ణయిస్తాయి. ప్రస్తుత కాలంలో అధికారంలో వున్న పాలకుల అవసరాలు అనివార్యతలే ఈ అంశాన్ని నిర్దేశిస్తాయి. తెలంగాణా వత్తిడి విభజన ప్రకటనకు దారితీయగా సీమాంధ్ర లాబీయింగ్ ఆప్రకటనను నిలుపుదల చేయించడం వరకే ఉపయోగపడింది.ఈ తమాషాను పదేళ్ళుగాచూస్తున్న కాంగ్రెస్ ఇపుడు కళ్ళుతెరచినట్టే కనిపిస్తోంది.

దేశాన్ని పరిపాలిస్తున్న ముందుముందుకూడా పాలించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అవసరం రాష్ట్రవిభజన అంశాన్ని ఈసారి గట్టిగానే ముందుకి తెచ్చింది. తెలంగాణాలో పాకిపొయిన సొంత రాష్ట్రం సెంటిమెంటును సొమ్ముచేసుకోడానికి టి ఆర్ ఎన్ ఇప్పటికే ముందుంది. అందులో పెద్దవాటా తనదేనంటూ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ కాళ్ళు లాగేస్తోంది. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను సీమాంధ్రకే పరిమితం చేస్తే తెలంగాణా ప్రాంతంలోనైనా ఆధిక్యత తెచ్చుకోవాలన్నది కాంగ్రెస్ లెఖ్ఖ.

ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో శుక్రవారం సాయంత్రం జరిగిన కోర్ కమిటీలో తెలంగాణ అంశంపై చర్చించారు. ఇతర కీలక అంశాలతో పాటు తెలంగాణపై వర్కింగ్ కమిటీలో చర్చించారు. తెలంగాణపై సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించాల్సిన నేపథ్యంలో శుక్రవారం జరిగిన భేటీ అత్యంత ప్రాధాన్య సంతరించుకుంది. యూపీఏ భాగస్వామ్య పార్టీలతో కూడా చర్చలు జరపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి యుపిఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, కమల్ నాథ్, అహ్మద్ పటేల్, ఆంటోనీ తదితరులు హాజరయ్యారు. గంటపాటు ఈ బృందం సమాలోచనలు జరిపింది.

పార్లమెంటు సమావేశాల్లోపే సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సీడబ్ల్యూసీ సమావేశం ఎప్పుడు అనేది వచ్చే వారం నిర్ణయించనున్నారు. మరోవైపు తెలంగాణ అంశంపై రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ భోపాల్ లో శుక్రవారం మధ్యాహ్నాం ఓ ప్రటకన చేశారు.

తెలంగాణ విషయంలో సంప్రదింపుల ప్రక్రియ ఇప్పటికే పూర్తైందని, అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుని త్వరలో ప్రకటన చేస్తుందని ఆయన చెప్పారు. గత వారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలోనే తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని భావించినా, బంతిని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కోర్టులోకి నెట్టేసిన విషయం తెలిసిందే. ఈమేరకు ఈనెల 26న సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం సమాయత్తమవుతోంది. సీడబ్ల్యూసీ భేటీ తర్వాత రెండు మూడు రోజులకు కేంద్రానికి కాంగ్రెస్ పార్టీ లేఖ రాస్తుంది
అదే సమయంలో ఈనెల చివరి వారంలో యూపీఏ భాగస్వామ్య పక్షాలతో సమావేశం నిర్వహించి తెలంగాణపై నిర్ణయం పూర్వాపరాలను వివరిస్తారనీ, భాగస్వామ్య పక్షాల అనుమతితో బిల్లు రూపకల్పనకు శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలన్నాయి. తెలంగాణ అంశంపై క్యాబినెట్ లో చర్చించి ఆ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం కూడా ఉందని ఏఐసీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఆగస్టు తొలి వారంలో రాష్ట్రపతి కార్యాలయానికి తెలంగాణ ఏర్పాటు బిల్లును పంపించి ఆగస్టు 15లోగా అసెంబ్లీ తీర్మానం కోసం మన రాష్ట్రానికి పంపవచ్చని సమాచారం. శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్తో సమావేశమయ్యారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసన సభ ఆమోదించవలసిన తీర్మానం గురించి దిగ్విజయ్ సింగ్ నాదెండ్ల మనోహర్తో చర్చించారంటున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియలో శాసన సభ తీర్మానం ఒక మలుపు లాంటిది. తీర్మానాన్ని చర్చకు చేపట్టే సమయంలో స్పీకర్ అత్యంత మెలుకువతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. 2009 డిసెంబర్ 9న అప్పటి హోం శాఖ మంత్రి పి చిదంబరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించటంతోపాటు దీనికోసం రాష్ట్ర శాసన సభ ఒక తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యను అదేశించినట్లు చెప్పటం తెలిసిందే. అప్పట్లో రాష్ట్ర శాసన సభలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరే తీర్మానం చర్చకు రాకముందే తెలుగుదేశం, కాంగ్రెస్ తదితర పార్టీలకు చెందిన సీమాంధ్ర శాసన సభ్యులు రాజీనామా చేయటం, ఆ తరువాత పెద్ద ఎత్తున గొడవ జరగటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి శాసన సభలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తీర్మానాన్ని ప్రతిపాదించి చర్చించటం గొడవతో కూడుకున్న విషయం అనేది అందరికి తెలిసిందే. అందుకే దిగ్విజయ్తో నాదెండ్ల జరిపిన చర్చలకు ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర శాసన సభలో పార్టీల బలాబలాల గురించి కూడా వారు చర్చించి ఉంటారని భావిస్తున్నారు. ఆరు సూత్రాల పథకాన్ని ఎత్తివేస్తేనే… ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే మొదట ఆరు సూత్రాల పథకాన్ని ఎత్తి వేసేందుకు వీలుగా రాజ్యాంగ సవరణ చేయవలసి ఉంటుందని అంటున్నారు. రాజ్యాంగంలోని 371 డి ప్రకారం ఉద్యోగుల నియామకాలకు సంబంధించిన ప్రత్యేక నిబంధలను ఆరు సూత్రాల పథకం పేరుతో జారీ చేయటం తెలిసిందే. 1969 తెలంగాణ ఉద్యమం తరువాత ఈ ఆరు సూత్రాల పథకాన్ని జారీ చేస్తూ దీనికోసం రాజ్యాంగాన్ని సవరించారు. లోక్సభలో రాజ్యాంగ సవరణకు మూడింటా రెండు వంతుల మెజారిటీ అవసరమవుతుంది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ వారం, పది రోజుల క్రితం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడారని అంటున్నారు.

ఇక 10జిల్లాల తెలంగాణ, 12జిల్లాల రాయల తెలంగాణలపై కూడా అధిష్టానం కసరత్తు చేస్తోంది. పది జిల్లాల తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను విలీనం చేసుకోవాలన్నది కాంగ్రెస్ యోచన. రాయల తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ విలీనానికి అంగీకరించకపోవచ్చని కాంగ్రెస్ అనుమానిస్తోంది. ఈ కారణంగానే టీఆర్ఎస్ అగ్రనేతలను తరచూ సంప్రదిస్తూనే ఉన్న కాంగ్రెస్ అధిష్ఠానం.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అంశంపైనా కసరత్తు చేస్తోందని కాంగ్రెస్ వర్గాలన్నాయి. మొత్తానికి 2014లో రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోందని ప్రచారం సాగుతోంది.

ఇదంతా అర్ధమవ్వడంవల్లే సమైక్యాంధ్ర వుండాలన్న కాంగ్రెస్ వాదులు “యు” టర్న్ తీసుకున్నారు.విడిపోయినా ఫరవాలేదుగాని సభల్లో చర్చజరగాలని రాజమండ్రి ఎంపి ఉండవిల్లి అరుణ్ కుమార్ కొత్తపల్లవి అందుకున్నారు..ఇది మాటమార్చే ప్రక్రియలో పక్కదారి చూపించడమేతప్ప పెద్దచర్చకు కాంగ్రెస్ అవకాశమీయదని ఆయనకీ తెలుసు

విడిపోవాలన్న వారి కోరికతీరుతుంది కాబట్టి కలిసుందామనేవారు మెరుగైన పాకేజి కోసం పట్టుబట్టడమే మిగిలివుంది

4-08-2013

సమైక్యవాదులూ డిమాండు మార్చండి!


హైదరాబాద్ తో మినహా మిగిలిన తెలంగాణాతో మనకి భౌతిక బాంధవ్యాలు, మానసిక అనుబంధాలు లేవు.
30 లక్షల మంది మనవాళ్ళున్న హైదరాబాద్ మనది కదనుకుంటే బాధ… అక్కడున్న మన వాళ్ళకి రక్షణ వుండదని భయం…హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని గా చేయాలన్న డిమాండుతో రాజమండ్రి అర్బన్ దళిత ఐక్యవేదిక ఉద్యమిస్తోంది. మన భయాలకు ఇదో పరిష్కారమే!
మన పన్నుసొమ్మును మన ప్రాంతాల అభివృద్ధికే వినియోగించుకోకుండా ఇంకెంతకాలం హైదరాబాద్ ను(తెలంగాణా) పోషించాలని తాడేపల్లిగూడెంలో సాఫ్ట్ వేర్ నిపుణుడు వెంకట్ మైలవరపు ప్రశ్నిస్తున్నారు. కాలంతీరిన సమైక్యాంధ్ర పై  “రాయలాంధ్రుల” చేస్తున్నఉద్యమ డిమాండ్లు మారుతాయని సామాజిక అర్ధిక రాజకీయాల విశ్లేషకుడు, చదువుకున్న జర్నలిస్టు డానీ అంచనావేశారు.
తెలంగాణా ఉద్యమం న్యాయబద్ధమైనదనీ రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాలు విడివిడిగా సొంతంగా రాషా్ట్రలు నిర్మించుకోవడం అవసరమనీ నేను గట్టిగా నమ్ముతున్నాను.
సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమానికి కొత్త ఎజెండాను ప్రతిపాదించిన రాజమండ్రి దళిత ఐక్యవేదికకు, కళ్ళుతెరవండని వెటకారంగా హెచ్చరించిన వెంకట్ మైలవరపు గారికీ కృతజ్ఞతలు అభినందనలు!
సమైక్య వాదానికి కాలం తీరిందనడానికి గుర్తుగా ముందుగా రాలిన ఈ రెండు చినుకులూ కుంభవృష్టి కావాలనే కోరుకుంటున్నాను

వేర్పాటుకే పోరాటాలు సమైక్యతకు ఉద్యమాలుండవు 2తెలుగు రాషా్ట్రల్లో వచ్చే ఎన్నికలు!!


ప్రజల ఇష్టప్రకారం రాజ్యాలు ఏర్పడిన చరిత్ర ఒక్కటీలేదు.ఏచరిత్రలోనైనా యుద్ధాలు, సంధులే రాజ్యాల్ని సృష్టించాయి. హద్దుల్ని నిర్దేశించాయి. ఆధునిక ప్రజాస్వామ్యంలో కూడా అందుకు భిన్నమైన పరిస్ధితి వుండదు. ఇక్కడ యుద్దాలంటే వత్తిళ్ళే! సైనికులంటే నాయుల్ని అనుసరించే సహచరులు అనుచరులు కార్యకర్తలే ! కాంగ్రెస్ పదేళ్ళ నిర్ణయరాహిత్యం వల్ల /కాలయాపనవల్ల/ ఉదాసీనతవల్ల ఈ మూడింటి వల్లా వత్తిళ్ళు పెరిగి ఉద్వేగాలై ప్రజల్లోకి ప్రవహిస్తున్నాయి. 
వేర్పాటుకే ఉద్యమాలూ పోరాటాలు వుంటాయితప్ప సమైక్యతకు అలాంటివి వుండే అవకాశమేలేదు. కెసిఆర్ తెలంగాణా సెంటిమెంటుని ప్రజల్లోకి తీసుకువెళ్ళారు. ఉద్యమాన్ని నిర్మించారు. ఆందోళనలు చేశారు. ప్రతీసారీ సీమాంధ్రనాయకులు వెటకారపు ఖండనలు, హేళనా పూర్వకమైన విమర్శలు, టివిల్లో ముచ్చట్లేతప్ప రాష్ట్రం కలసి వుండవలసిన అవసరాన్ని జనబాహుళ్యంలోకి తీసుకువెళ్ళే ప్రయత్నాలే చేయలేదు. ఇందువల్ల తెలంగాణా ప్రజల్లో రెండో ఆలోచనే లేకుండాపోయింది. అప్పటికే ఉద్వేగంతో వున్న తెలంగాణా వారికి సీమాంధ్ర నాయకుల ప్రకటనలు హేతుబద్ధతలేని నినాదాలుగా మాత్రమే కనిపిస్తున్నాయి. రాజకీయకార్యకర్తలు, పార్టీలు సంస్ధల కార్యకర్తలు, విద్యార్ధులు మినహా సామాన్య ప్రజలెవరూ సమైక్యాంధ్ర కోసం ఆందోళనల్లో పాల్గొనలేదు.
1969 తెలంగాణా ఉద్యమంలో ఆంధ్రులు 1972 జై ఆంధ్ర ఉద్యమంలో తెలంగాణావారూ మౌనంగానే వుండిపోయారు. ఇపుడూ దాదాపు అంతే…
అసలు రాష్టా్రలు విడిపోవడమో కలసివుండటమో ప్రజల ఇష్టప్రకారం జరగవు. వత్తిళ్ళే హద్దుల్ని నిర్ణయిస్తాయి. ప్రస్తుత కాలంలో అధికారంలో వున్న పాలకుల అవసరాలు అనివార్యతలే ఈ అంశాన్ని నిర్దేశిస్తాయి. తెలంగాణా వత్తిడి విభజన ప్రకటనకు దారితీయగా సీమాంధ్ర లాబీయింగ్ ఆప్రకటనను నిలుపుదల చేయించడం వరకే ఉపయోగపడింది.ఈ తమాషాను పదేళ్ళుగాచూస్తున్న కాంగ్రెస్ ఇపుడు కళ్ళుతెరచినట్టే కనిపిస్తోంది.
దేశాన్ని పరిపాలిస్తున్న ముందుముందుకూడా పాలించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అవసరం రాష్ట్రవిభజన అంశాన్ని ఈసారి గట్టిగానే ముందుకి తెచ్చింది. తెలంగాణాలో పాకిపొయిన సొంత రాష్ట్రం సెంటిమెంటును సొమ్ముచేసుకోడానికి టి ఆర్ ఎన్ ఇప్పటికే ముందుంది. అందులో పెద్దవాటా తనదేనంటూ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ కాళ్ళు లాగేస్తోంది. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను సీమాంధ్రకే పరిమితం చేస్తే తెలంగాణా ప్రాంతంలోనైనా ఆధిక్యత తెచ్చుకోవాలన్నది కాంగ్రెస్ లెఖ్ఖ. 
ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో శుక్రవారం సాయంత్రం జరిగిన కోర్ కమిటీలో తెలంగాణ అంశంపై చర్చించారు. ఇతర కీలక అంశాలతో పాటు తెలంగాణపై వర్కింగ్ కమిటీలో చర్చించారు. తెలంగాణపై సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించాల్సిన నేపథ్యంలో శుక్రవారం జరిగిన భేటీ అత్యంత ప్రాధాన్య సంతరించుకుంది. యూపీఏ భాగస్వామ్య పార్టీలతో కూడా చర్చలు జరపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి యుపిఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, కమల్ నాథ్, అహ్మద్ పటేల్, ఆంటోనీ తదితరులు హాజరయ్యారు. గంటపాటు ఈ బృందం సమాలోచనలు జరిపింది. 
పార్లమెంటు సమావేశాల్లోపే సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సీడబ్ల్యూసీ సమావేశం ఎప్పుడు అనేది వచ్చే వారం నిర్ణయించనున్నారు. మరోవైపు తెలంగాణ అంశంపై రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ భోపాల్ లో శుక్రవారం మధ్యాహ్నాం ఓ ప్రటకన చేశారు.
తెలంగాణ విషయంలో సంప్రదింపుల ప్రక్రియ ఇప్పటికే పూర్తైందని, అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుని త్వరలో ప్రకటన చేస్తుందని ఆయన చెప్పారు. గత వారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలోనే తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని భావించినా, బంతిని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కోర్టులోకి నెట్టేసిన విషయం తెలిసిందే. ఈమేరకు ఈనెల 26న సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం సమాయత్తమవుతోంది. సీడబ్ల్యూసీ భేటీ తర్వాత రెండు మూడు రోజులకు కేంద్రానికి కాంగ్రెస్ పార్టీ లేఖ రాస్తుంది
అదే సమయంలో ఈనెల చివరి వారంలో యూపీఏ భాగస్వామ్య పక్షాలతో సమావేశం నిర్వహించి తెలంగాణపై నిర్ణయం పూర్వాపరాలను వివరిస్తారనీ, భాగస్వామ్య పక్షాల అనుమతితో బిల్లు రూపకల్పనకు శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్  వర్గాలన్నాయి. తెలంగాణ అంశంపై క్యాబినెట్ లో చర్చించి ఆ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం కూడా ఉందని ఏఐసీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఆగస్టు తొలి వారంలో రాష్ట్రపతి కార్యాలయానికి తెలంగాణ ఏర్పాటు బిల్లును పంపించి ఆగస్టు 15లోగా అసెంబ్లీ తీర్మానం కోసం మన రాష్ట్రానికి పంపవచ్చని సమాచారం. శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్తో సమావేశమయ్యారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసన సభ ఆమోదించవలసిన తీర్మానం గురించి దిగ్విజయ్ సింగ్ నాదెండ్ల మనోహర్తో చర్చించారంటున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియలో శాసన సభ తీర్మానం ఒక మలుపు లాంటిది. తీర్మానాన్ని చర్చకు చేపట్టే సమయంలో స్పీకర్ అత్యంత మెలుకువతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. 2009 డిసెంబర్ 9న అప్పటి హోం శాఖ మంత్రి పి చిదంబరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించటంతోపాటు దీనికోసం రాష్ట్ర శాసన సభ ఒక తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యను అదేశించినట్లు చెప్పటం తెలిసిందే. అప్పట్లో రాష్ట్ర శాసన సభలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరే తీర్మానం చర్చకు రాకముందే తెలుగుదేశం, కాంగ్రెస్ తదితర పార్టీలకు చెందిన సీమాంధ్ర శాసన సభ్యులు రాజీనామా చేయటం, ఆ తరువాత పెద్ద ఎత్తున గొడవ జరగటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి శాసన సభలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తీర్మానాన్ని ప్రతిపాదించి చర్చించటం గొడవతో కూడుకున్న విషయం అనేది అందరికి తెలిసిందే. అందుకే దిగ్విజయ్తో నాదెండ్ల జరిపిన చర్చలకు ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర శాసన సభలో పార్టీల బలాబలాల గురించి కూడా వారు చర్చించి ఉంటారని భావిస్తున్నారు. ఆరు సూత్రాల పథకాన్ని ఎత్తివేస్తేనే… ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే మొదట ఆరు సూత్రాల పథకాన్ని ఎత్తి వేసేందుకు వీలుగా రాజ్యాంగ సవరణ చేయవలసి ఉంటుందని అంటున్నారు. రాజ్యాంగంలోని 371 డి ప్రకారం ఉద్యోగుల నియామకాలకు సంబంధించిన ప్రత్యేక నిబంధలను ఆరు సూత్రాల పథకం పేరుతో జారీ చేయటం తెలిసిందే. 1969 తెలంగాణ ఉద్యమం తరువాత ఈ ఆరు సూత్రాల పథకాన్ని జారీ చేస్తూ దీనికోసం రాజ్యాంగాన్ని సవరించారు. లోక్సభలో రాజ్యాంగ సవరణకు మూడింటా రెండు వంతుల మెజారిటీ అవసరమవుతుంది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ వారం, పది రోజుల క్రితం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడారని అంటున్నారు.
ఇక 10జిల్లాల తెలంగాణ, 12జిల్లాల రాయల తెలంగాణలపై కూడా అధిష్టానం కసరత్తు చేస్తోంది. పది జిల్లాల తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను విలీనం చేసుకోవాలన్నది కాంగ్రెస్ యోచన. రాయల తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ విలీనానికి అంగీకరించకపోవచ్చని కాంగ్రెస్  అనుమానిస్తోంది. ఈ కారణంగానే టీఆర్ఎస్ అగ్రనేతలను తరచూ సంప్రదిస్తూనే ఉన్న కాంగ్రెస్ అధిష్ఠానం.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అంశంపైనా కసరత్తు చేస్తోందని కాంగ్రెస్ వర్గాలన్నాయి. మొత్తానికి 2014లో రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోందని ప్రచారం సాగుతోంది.
ఇదంతా అర్ధమవ్వడంవల్లే సమైక్యాంధ్ర వుండాలన్న కాంగ్రెస్ వాదులు “యు” టర్న్ తీసుకున్నారు.విడిపోయినా ఫరవాలేదుగాని సభల్లో చర్చజరగాలని రాజమండ్రి ఎంపి ఉండవిల్లి అరుణ్ కుమార్ కొత్తపల్లవి అందుకున్నారు..ఇది మాటమార్చే ప్రక్రియలో పక్కదారి చూపించడమేతప్ప పెద్దచర్చకు కాంగ్రెస్ అవకాశమీయదని ఆయనకీ తెలుసు
విడిపోవాలన్న వారి కోరికతీరుతుంది కాబట్టి కలిసుందామనేవారు మెరుగైన పాకేజి కోసం పట్టుబట్టడమే మిగిలివుంది