భాషంటే అది మాట్లాడే ప్రజలు, వారి సంస్కృతీ, చరిత్రా….అవి ధ్వంసమయ్యాక భాష ఒక్కటే బతికి వుండటం సాధ్యం కాదు. (అమ్మని మమ్మీ నాన్నని డాడీ చంపేసినట్టు)
* భాషను జనం మాటగా మార్చి గిడుగురామ్మూర్తి పంతులుగారు తెలుగుకి వందేళ్ళు ఊపిరిపోశారు…
* ప్రపంచవ్యాపతంగా మరణిస్తున్న సగంభాషల్లో అనేక పరిణామాలవల్ల తెలుగు కూడా చేరిపోయింది
* యునెస్కో నివేదిక ప్రకారం 2025 నాటికి మనదేశంలో హిందీ బెంగాలీ మరాఠీ తమిళం మళయాళ భాషలు మాత్రమే వుంటాయి
* తెలుగు మాయమైపోతూండటం విచారకరమే అయినా ఇదొక పరిణామక్రమంగా స్వీకరిస్తున్నాను
* ఉన్నత రాజకీయాధికారంలో వున్నవారిలో మండలి బుద్ధప్రసాద్ గారికితప్ప ఎవరికీ తెలుగు పట్ల ప్రత్యేకమైన శ్రద్ధాసక్తులు లేవు…ఇందువల్ల తెలుగుని ఉద్ధరించేస్తామనే నాయకుల మాటలు మనకి వినబడవు…ఒక వేళ ఎవరైనా అలా చెబితే అవి దొంగమాటలే అని మరో ఆలోచనలేకుండా అనేసుకోవచ్చు.
* ప్రపంచంలో ఏమతమైనా తనను తాను ప్రచారం చేసుకోడానికి ప్రజల భాషను ఆశ్రయిస్తే మన వైదీకం జనం భాషకు దూరమై రహస్యంగా వుండిపోయింది
* సంసృ్కతాన్ని పక్కన పెట్టి గౌతమబుద్ధుడు, మహావీరుడు ప్రజలభాష “పాళీ”లో చేసిన బోధనలు శరవేగంతో దేశాన్ని చుట్టుముట్టాయి
* పండితుల సంస్కృత భారతాన్ని వందల ఏళ్ళతరువాతే నన్నయ తెలుగునేల మీదకు తీసుకురాగలిగారు
* తెలుగుదేశాన్ని ఎవరుపాలించినా సంస్కృతమో, పారశీకమో, ఊర్దోనో, ఇంగ్లీషో పాలకుల భాషగావుండిపోయాయి
* ఉద్యోగాలు కేంద్ర బిందువులై నైజాములో ఉర్దూ, ఆంధ్రాలో ఇంగ్లీషూ తెలుగుని టెలుగూ గా మార్చేశాయి
* తెలుగుకోసం ఉద్యమాలు చేసి రాషా్ట్రలు సాధించిన తెలుగువాడు కూర్చున్న కొమ్మను తానే నరికేసుకుంటున్నాడు
* ఇంగ్లీషువాళ్ళు , నిజాం స్కూళ్ళవరకూ తెలుగుని అనుమతించారు తెలుగువాడు తల్లఒడిలోనే మాతృభాషను తన్నేస్తున్నాడు
* మెకాలే ఊహలోనే లేని ఉగ్గుపాల నుంచే ఎబిసిడిలను అడుగులు పడనపుడే ఐఐటి కోచింగ్ లను తెలుగువాడు మోహిస్తున్నాడు
* ఉద్యోగాలు ఇస్తున్నపుడు, తల్లిదండ్రులే చదివించుకుంటున్నపుకు ఇంగ్లీషంటే నొప్పి ఎందుకని సుప్రీం కోర్టే ప్రశ్నిస్తోంది
* పక్కదారులనుంచి దేశంలో దూరిన బ్రిటీష్ వాడిని తరిమేసిన ఉద్యమ విలువలు అమెరికావాడికి ఎస్ బాస్ అనేలా తిరగబడ్డాక మాతృభాషకు చోటెక్కడ?
* మార్కెట్టే జీవిత సర్వస్వమైపోయాక డాలర్ గరగరలు తప్ప తెలుగు నాణాలు మోగుతాయా
* ఆత్మనే అమ్మకుకున్నాక అమ్మ భాష మీద మమకారముంటుందా?
* మాతృభూమిని ప్రేమించకుండా మాతృభాషను కాపాడుకోవడం కుదురుతుందా?