పిల్లలలో అసంబంధాలు / Unattached Life


పెద్దాడ నవీన్)

20-7-2018

ఇంటికే పరిమితమైన సామాజిక జీవనం…లివింగ్ రూమ్ కే పరిమితమైన

కుటుంబ జీవనం…మమ్మీ, డాడీ – వాళ్ళ తోబుట్టువులను, వారి బాధ్యతలను వొదిలించుకోడానికి చూపించే లౌక్యం, పడే శ్రమ…పైమెట్టు మీద వున్నవారితో పరిచయాలు పెంచుకునే తాపత్రయాలు, సంబంధాలు, స్నేహాలు…

వ్యక్తిత్వ వికాసానికి అమ్మ నాన్నల గైడెన్స్ అవసరమైన టీనేజిలో మనోభావాల్ని, సహజస్పందనల్ని చిదిమేసే బ్రాండ్ (నారాయణ చైతన్య)చదువులు…అవసరానికి మించి యిచ్చే పాకెట్ మనీ…ఏమి తాగాలో ఏమి తినాలో ఏమిచెయ్యాలో ఎలా వుండాలో నిర్ణయించే మార్కెట్…వీటి మధ్యే తిరుదుతున్న, పెరుగుతున్న పిల్లలకు ప్రేమంటే????

వీళ్ళకి పరిసరాలను, చుట్టు వున్న సమాజాన్ని, ప్రకృతిని, చుట్టూవున్న మనుషుల్ని, టీచర్లని, తోటి పిల్లల్ని, తాతయ్యల్ని, అమ్మమ్మల్ని, నానమ్మల్ని, చివరికి మమ్మీ, డాడీలని కూడా ప్రేమించడం తెలియదు. వియ్ లవ్ ఆల్ అని పెట్ యానిమల్స్ పేర్లను కలుపుకుని పెద్ద లిస్టే చదువుతారు…అందరినీ ప్రేమిస్తున్నామనే అనుకుంటారు…అసలు వీళ్ళకి ప్రేమంటే తెలియదు…

వీళ్ళకి ప్రేమంటే- యవ్వనంలో స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణను పరస్పరం వ్యక్తీకరించుకునే మోడ్…ఇష్టపడినది దక్కని స్ధితి ఎదురైతే ఆ షాక్ నుంచి బయటపడటానికి సమాజంలో సమాజంతో వీరికి బలమైన అనుబంధాలు లేవు…దేనికోసమో బతకాలి బతికితీరాలి అనుకోడానికి వీరికి ఏ విధమైన ఆలంబనా లేదు…

పరిసరాల్ని ప్రేమించలేనివారు పౌరులు కాలేరు…ప్రతి ఒక్కరిలో స్వాభావికంగా వుండే భావనాత్మక సౌందర్యం ( ఈస్ధటిక్ సెన్స్) భౌతిక ప్రపంచాన్ని మించిన భావనా ప్రపంచాన్ని పిల్లల హృదయంలో, మనసులో, ఆలోచనలలో నిర్మిస్తుంది…అది లౌకికప్రపంచంలో కార్నర్ అయిపోయినప్పుడు మనుషులకు సేఫ్టీ నెట్ అవుతుంది…అది మనుషుల్ని అక్కున చేర్చుకుని కొత్తజీవితానికి, కొత్త అనుబంధాలకు ప్రేరణ ఇస్తుంది…విఫలమైన / భగ్నమైన ప్రేమ కొంత సమయం తీసుకుని తిరిగి హృదయానికి చేరుకుంటుంది…

అసలు, సమస్యంతా పిల్లలకు భావనా ప్రపంచం లేకపోవడమే…మమ్మీ, డాడీ, కుటుంబం, నైబర్స్, స్నేహితులు, టీచర్లు, సమాజం, ప్రకృతి….దేనితోనూ అటాచ్ మెంటు లేకుండా పెరిగే పిల్లలకు మానసిక పర్యావరణం / ఎమోషనల్ ఎన్విరాన్ మెంటు ఎక్కడుంటుంది?

ఇది మతాతీత విశ్వాసం! 


ఇది మతాతీత విశ్వాసం! 
ఇవాళ సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళినీ, మొన్న హైదరాబాద్ లో పెద్దమ్మ తల్లినీ చూశాము. 
జీవితాన్ని కలుషితం చేసుకున్న మనం…నైతికతను కోల్పోయిన మనుషులం…అసంతృప్తులను చల్లబరచుకోడానికో శూన్యాల్ని పూడ్చుకోడానికో మతాన్ని కౌగలించుకున్నాం…మనిషి ఉనికిని ఆధ్యాత్మికత ద్వారా సిద్ధాంతీకరించే ప్రయత్నం చేసే మతం మీద నాకు తృణీకారమైతే లేదుగాని, మతం మీదకంటే గ్రామ దేవతలంటేనే ప్రేమ గౌరవాలు వున్నాయి. 
పెద్దపెద్ద కళ్ళతో పసుపు పచ్చ శోభతో మూడడుగులు కూడా ఎత్తులేని ఈ పెద్దమ్మ, మహంకాళి తల్లులు ప్రజల నమ్మకాల్లో ఎవరెస్టుకి మించిన ఎత్తులో వున్నారు. 
జీవనవిధానంలో ఒకవిధమైన ప్రాకృతిక ధర్మాన్ని, నిరాడంబరతనీ, సొంత నైతికతనీ పాటించే మనిషి సాంఘిక స్వయంభువత్వమే మతాతీత విశ్వాసం. అక్కడ అన్నంలో బిరుసైన మొరటుతనం వున్నా, బలి ఇచ్చే కోడీ మేకా దున్నల చావు వాసన ఆవరించివున్నా ఏదో పవిత్రత అనుభూతిలోకి వస్తూనే వుంటుంది. 
జంగారెడ్డిగూడెం గంగానమ్మ జాతర, తాడువాయి వీరభద్రుడి తిరనాళ్ళ, నిడదవోలులో కొటసత్తెమ్మ మొక్కు, గోదావరి కుడి గట్టున గుబ్బలమంగమ్మ గుడి, రాజమండ్రిలో సోమాలమ్మ కాపలా, లోవలో తలుపులమ్మ తల్లిదయ…మతంతో నిమిత్తంలేని ఇన్ని జాతర్లు, మరెన్ని సంబరాలు నమ్మకానికీ, ఇచ్చిన మాట నిలబెట్టుకునే / మొక్కుతీర్చుకునే మనిషి నిబద్ధతకీ ఆనవాళ్ళు…అన్నిమతాలవారూ తీర్చుకునే మొక్కబళ్ళు
రాజమండి ఇస్కాన్ టెంపుల్ లో పరిమళాలు బాగుంటాయి. పాతసోమాలమ్మ గుడిలో కూర్చుంటే ఇది నాది అనిపిస్తుంది. కంచిమఠం లో గంభీర ప్రశాంతత కంటే అర్ధంకాని మంత్రాలు అతి తక్కువగా వుండే హైదరాబాద్ పెద్దమ్మ గుడిలో, సికిందరాబాద్ మహంకాళి గుడిలో…అసలు ఏగ్రామదేవతల గుడిలో అయినా మనుషుల అలికిడి అలజళ్ళే నచ్చుతాయి. 
మామూలు మనిషిని కాస్తదూరంగా వుంచే మతంకంటే, కష్టమొచ్చినపుడు చేయి పట్టుకున్నట్టు భరోసా ఇచ్చే మతాతీతమైన విశ్వాసమే నాకు ఇష్టంగా వుంటుంది.
మొక్కుకోవడానికి ఒకసారి, మొక్కు చెల్లించుకోడానికి మరోసారి జనులు తరలి వచ్చే యాత్రలో ఖర్చయ్యే ప్రతి రూపాయీ మన చుట్టూ వున్న ఎకనామిక్స్ ఎలా, ఎంతగా స్టిమ్యులేట్ చేస్తూందో గుడి చుట్టూ వున్న దుకాణాల్ని కాసేపు గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 

  

గోదావరిలో నీటి ఎద్దడి 


  
గోదావరి డెల్టాలో రెండో పంటకు నీటి ఎద్దడి పదమూడేళ్ళనాటి తీవ్రతకు మించి వుండగలదని ఇరిగేషన్ ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. ఇది కనీసం మూడువేల కోట్లరూపాయల వ్యవసాయిక ఆర్ధిక వ్యవస్ధను ప్రభావితం చేస్తుంది. అయితే తక్కువ నీటితోనే ఎక్కువ దిగుబడులు సాధించి చరిత్రను తిరగ రాయాలని రైతులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాజెక్టు కమిటీ భావిస్తోంది. కమిటీ, ఇరిగేషన్ శాఖ సంయుక్తంగా రైతుల్ని ఏమేరకు మోటివేట్ చేయగలరు అన్నదాన్ని బట్టే ధాన్యాగారమైన గోదావరిజిల్లాల్లో రెండో పంట స్ధితీగతీ వుంటాయి.
http://www.telugu360.com/te/godavari-deltas-in-water-crisis/

స్కిల్ ఇండియా


అత్యధికమైన వృత్తి నైపుణ్యాలు బిసిల చేతుల్లోనే వున్నాయి. వాటికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి సానబట్టే ‘నైపుణ్యభారత్’ సోషల్ ట్రాన్స్ ఫర్మేషన్ ని తీసుకువస్తుంది. రామస్వామి పెరియార్ సాంఘిక ఉద్యమాల ద్వారా బిసిలను కూడగట్టారు. ఇప్పటికీ తమిళనాడు రాజకీయపార్టీల్లో ప్రాబల్యం బిసిలదే. ఆంధ్రప్రదేశ్ లో ఎన్ టి ఆర్ ‘ఆదరణ’ పధకం ద్వారా బిసిల ఆర్ధిక ఉన్నతికి దోహదపడ్డారు. అది తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంకు అయ్యింది.  
నేడు 63 వ సంవత్సరంలో ప్రవేశించిన నరేంద్రమోదీ ‘స్కిల్ ఇండియా’ దేశవ్యాప్తంగా బిసి ఎంపవర్ మెంటుకి బాటవేస్తుంది.
http://www.telugu360.com/te/india-to-lead-transformation/ 
  

స్పందనా రాహిత్యమే జాతీయ విధానం ఎవరికీ పట్టని రైతు ఆత్మహత్యలు


ఇది…కష్టాలు, ఆశలు అరణ్యరోదనగా మారినపుడు, తమ మనోభావాలకు వేదికగా వుండవలసిన ప్రజా ప్రతినిధులు దగా పూరితంగా వ్యవహరిస్తున్నపుడు, రైతులు తమ గుండెకోతను వ్యక్తం చేయడానికి మిగిలిన మార్గం…ఆత్మహత్య
ఇది…వ్యక్తిగతం కాదు, వ్యవస్ధీకృతం!

స్పందనా రాహిత్యమే జాతీయ విధానం ఎవరికీ పట్టని రైతు ఆత్మహత్యలు

IMG_0379

ధర రాదు అప్పుతీరదు యూరప్ రైతులదీ అదే కథ!


జీవన వ్యాపకాల్లో మౌలికమైన మార్పులు వచ్చినపుడు తలఎత్తే సంక్షోభాలు వ్యవస్ధాగతమైన ఆత్మహత్యలుగా మారిపోతున్నాయని ప్రపంచఅనుభవాలు రుజువు చేస్తూనే వున్నాయి. నివారణలకు ప్రత్యామ్నాయాలను కనుగొనడంలో ప్రభుత్వాలు విఫలమౌతూనే వున్నాయి. ఏ ఆర్ధిక సంక్లిష్టతకైనా మొదటి వేటు వేస్తున్నది వ్యవసాయరంగం మీదే!

http://www.telugu360.com/te/european-farmers-demand-aid-as-produce-prices/

  

కార్యకర్తల పునాదితోనే వారసుడికి నాయకత్వం!


…..చంద్రబాబు నాయుడు అనుచరులుగా సహచరులుగా వున్న నాయకులు అదే విధేయతను నారా లోకేష్ పట్ల చూపించడంలో పెద్ద ఇబ్బంది వయోబేధమే! క్రమంతప్పని తెలుగుదేశం సభ్యత్వాల నమోదు కొత్తతరం కార్యకర్తల్ని పార్టీలోకి తీసుకు వస్తుంది.వీరందరికీ నిరంతరాయంగా సిద్ధాంతపరమైన శిక్షణ, ఇచ్చేలా తెలుగుదేశం కార్యక్రమాన్ని రూపొందించింది. ఈఫలితాలు నాలుగైదేళ్ళలో లోకేష్ కు తిరుగులేని మద్దతుగా నిలుస్తాయి….

కార్యకర్తల పునాదితోనే వారసుడికి నాయకత్వం!

  

ఆయనే దేవుడు…ఆయనే దెయ్యం 


ముందే నిర్ణయించుకున్న మూసలతో రాతల్ని కొలిచే పాఠకులున్న క్షేతంలో…ఆరో వర్ధంతినాడు రాజశేఖరరెడ్డిగారిని ప్రస్తుతించడమంటే ఆయన అభిమానులతోనూ, వ్యతిరేకులతోనూ బూతులు తిట్టించుకోవడమే…నాలో పాత్రికేయ లక్షణం ఎంత మిగిలివుందో ఒక సారి చూసుకుందామని తిట్టింగుకోడానికి మిత్రుడు గోపాల్ ప్రేరణతో సిద్దమైపోయాను. వైఎస్ గురించే రాశావు చంద్రబాబు అంత పుడింగా అనే వాళ్ళకి సమాధానం ఇవ్వలేను ఎందుకంటే వాళ్ళు సమయమూ సందర్భమూ ఎరుగని మూర్ఖులు కాబట్టి ….

http://www.telugu360.com/te/ysr-is-god-he-is-the-demon/

   
 

అంతా ”కంటో్రల్” లోనే వుంది 


సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటి)ని విస్తృతంగా వినియోగిస్తున్న అతిపెద్ద ఈవెంటు గోదావరి పుష్కరాలే! 

ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాల్లో అధికారులు యధేచ్చగా స్మార్ట్ ఫోన్లు, టాబ్ లెట్ పిసిలు వాడుతున్నారంటే పాలనాయంతా్రంగంలో బాగా పెరిగిన ఐటి ప్రాధాన్యతని అర్ధం చేసుకోవచ్చు. 
ప్రతీఘాట్ కూ ఎస్ పి హోదాగల పోలీసు ఉన్నతాధికారులను ఇన్ చార్జ్ లు గా నియమించారు. పుష్కరఘాట్లతో సహా రాజమండ్రిలో ముఖ్యకూడలులను హైస్పీడ్ కనెక్టివిటీ వున్న కెమేరాలతో అనుసంధానం చేశారు.
పుష్కరఘాట్లు, సంబంధిత కేంద్రాల చుట్టూ పర్యటనలు, సమీక్షా సమావేశాల కాలాన్ని మినహాయిస్తే మిగిలిన సమయమంతా ముఖ్యమంత్రి సెంట్రల్ కంటో్రలు రూమ్ లోనే వుంటున్నారు. రాజమండ్రిని 360 డిగ్రీల కోణాల్లో ఎటుకావాలంటే అలా చూసే ఆపరేటర్ పనీ, ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకుని నిర్ణయాలుతీసుకునే అధికారిపనీ, విధాననిర్ణయం చేసే నాయకుడి పనులతో చంద్రబాబు ఏకకాలంలో మూడు పాత్రలు పోషిస్తున్నారు. 
తొక్కిసలాటలో 27 మంది దుర్మరణం పాలైనతర్వాత షాకయినా త్వరలోనే తేరుకుని పరిస్ధితిని అధికారుల, నాయకుల జడత్వం నుంచి విడిపించి తన చేతుల్లోకి తెచ్చుకున్నారు. పుష్కరయాత్రీకుల సదుపాయాలు, రక్షణ గాడినపడ్డాయనుకున్నాక ముఖ్యమంత్రి ఇతరవిధుల నిర్వహణ కూడా మొదలు పెట్టారు. 
పుష్కరయాత్రికుల నుంచి మూడు పద్ధతుల్లో నుంచి ఫీడ్ బేక్ తీసుకుంటున్నారు. ముద్రించిన సర్వే పేపర్లను యాత్రికులకు ఇచ్చి వారి అభిప్రాయాలను తెలుసుకోవడం, ఘాట్లతో లింక్ అయివున్న సెల్ టవర్ లలో కనిపించే మొబైల్ ఫోన్ నెంబర్లలో రాండమ్ గా నెంబర్లను ఎంచుకుని కాల్ చేసి ఫీడ్ బేక్ తెలుసుకోవడం, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (IVRS) ద్వారా యాత్రీకులే కాల్ చేసి ఫీడ్ బ్యాక్ ఇవ్వడం..టాయిలెట్లలో నీళ్ళకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. పారిశుద్యం తాగునీటి వసతి మెరుగుదలకు ఈ ఫీడ్ బ్యాక్ బాగా ఉపయోగపడిందని రోజుకి 50 వేలమందినుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నామని కంటో్రల్ రూమ్ అధికారి ఒకరు చెప్పారు. 
సమాచారాన్ని ప్రజలకు ఇవ్వడానికీ, ప్రజలనుంచి సమాచారాన్ని అందుకోడానికీ గోదావరి పుష్కరాలను సోషల్ మీడియాలో అధికారులు ప్రవేశపెట్టారు. రాజమండ్రి మెయిన్ పోలీస్ కంటో్రల్ రూమ్ ను 9491235816 నెంబర్ ద్వారా వాట్సప్ తో అనుసంధానం చేశారు. ఇదే కంటో్రల్ రూమ్ ని @APPOLICE100 హేండిల్ తో ట్విట్టర్ కి కనెక్ట్ చేశారు. అలాగే @gpmmc2015 ట్విట్టర్ హేండిల్ నుంచి ఫేస్ బుక్ లో gpmmcrjy ప్రొఫైల్ నుంచి ప్రజలు గోదావరి మహా పుష్కరాల విశేషాలు తెలుసుకోవచ్చు. 

రెండు రాషా్ట్రల సగటు మనిషిదీ ఒకటే హృదయం


రెండు రాషా్ట్రల సగటు మనిషిదీ ఒకటే హృదయం

(శనివారం నవీనమ్)
తన జీవితంలో ఎన్నో అంశాలను పరిశీలించి, పరిష్కరించానని, అయితే మనం దేశ,విదేశాల్లో ఎవరితో మిత్రుత్వం, శత్రుత్వం చేయాలో నిర్ణయించుకోవచ్చుగానీ, మన పక్కన వుండే వారిని నిర్ణయించుకోలేమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. కాబట్టి ఇష్టం ఉన్నా లేకున్నా…కలిసి బ్రతకాల్సిందేనని, అందరూ కలిసి దేశాభివద్ధికి దోహదం చేయాల్సిందేనని అదే చరిత్ర చెప్పిన పాఠమని నిన్న హైదరాబాద్ లో ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన చేసిన వ్యాఖ్యానాలు చంద్రబాబునాయుడు, కెసిఆర్ ప్రభుత్వాలను ”చెంపలు వాయించుకుని గుంజీలు తీయాలని” పెద్దమనిషి ప్రేమతో మందలించినట్టుగా వున్నాయి. 
కెసిఆర్ ఆంధ్రానాయకుల్ని లత్కోర్లు, లఫంగీలు అని హేళన చేసినా…నన్ను టచ్ చేస్తే తెలంగాణా ప్రభుత్వానిక అదే ఆఖరురోజని చంద్రబాబు ఊగిపోయినా ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణా ప్రజలుగాని ఆవేశాలతో రెచ్చిపోలేదు. టిఆర్ఎస్, తెలుగుదేశం పార్టీలు వాటివాటి వైరాల్ని, గొడవల్ని ప్రజలకు పులిమే ప్రయత్నాలు చేస్తున్నా వాటిని అంటించుకోని రెండు రాషా్ట్రల ప్రజల సామరస్యం, వివేకం, ఇంగితం తెలుగురాషా్ట్రల్లో సగటు మనిషి కొండంత ఎత్తున నిలిపివుంచింది.ఇదే స్పూర్తిని రాష్ట్రపతి మాటల్లోకి మార్చారా అనిపిస్తోంది.
హైదరాబాదు తెలంగాణలో భాగంగా రాజధానిగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని నిర్మాణం జరిగే లోగా పదేళ్లకు మించకుండా హైదరాబాదు నుంచే పాలన సాగించాలి గనక ఉత్పన్నమైన ప్రత్యేక నిబంధనల అధ్యాయమే సెక్షన్ 8 . రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌ రాష్ట్ర ప్రభుత్వ సలహాల ప్రకారమే నడుచుకోవాలి. తెలంగాణ ప్రభుత్వానికీ అదే సూత్రం వర్తిస్తుంది. హైదరాబాద్లో ఆంధ్రప్రదేశా పరభుత్వం కూడా నివాసముంటోంది.దీనిపై మరో రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీ చేసే అవకాశముండదు. కనుక మధ్యంతర దశలో గవర్నర్‌కు కొన్ని ప్రత్యేక బాధ్యతలు అప్పగించడమే ఆ సెక్షన్‌ ఉద్దేశం. ఆ ప్రకారం గవర్నర్‌ …భవనాల కేటాయింపు…పౌరుల, ప్రధాన సంస్థల భద్రతకు సంబంధించి పర్యవేక్షణ చేయవలసి ఉంటుంది. ఇందుకోసం కేంద్రం ఆయనకు ఇద్దరు సలహాదార్లను నియమి స్తుంది. తెలంగాణ మంత్రివర్గంతో సంప్రదిస్తూ దాని సలహాల మేరకు గవర్నర్‌ పనిచేస్తారు. అయితే ఎప్పుడైనా ఆయన గనక ఆ ప్రభుత్వ నిర్ణయాలతో విభేదిస్తే అప్పుడు ఆయన విచక్షణాధికారమే అంతిమమవుతుంది.
ఈ సెక్షన్‌ ఇప్పటి వరకూ అమలు జరిగిందా, లేదా అంటే ఏదో మేరకు అమలు జరుగుతూనే ఉంది. భవనాల కేటాయింపు, వాహనాల కేటాయింపు వంటివి ఆయన ఆధ్వర్యంలోనే జరిగాయి. ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారులే గాక మంత్రులూ, ముఖ్యమంత్రులూ కూడా ఆయనతో తరచూ సమావేశమవుతున్నారు. నాగార్జున సాగర్‌ డ్యాంపై పోలీసుల ఘర్షణ, ఎన్జీవోల కార్యాలయంలో ఘర్షణ వంటివి జరిగినప్పుడు ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడారు. ముఖ్యమంత్రులతో నూ సంప్రదించారు. విద్యా సంబంధ మైన విషయాల పైనా ఇరు రాష్ట్రాల మంత్రులూ ఆయనతో సమావేశమై అవగాహనకు వచ్చారు. ఇవన్నీ స్థూలం గా సెక్షన్‌ 8 పరిధిలోవే.

కాకపోతే అమలు కాని అంశం ఒకటుంది. ఈ సెక్షన్‌ అమలుకు నిబంధనల పేరిట కేంద్రం ఒక లేఖ రాసింది. అందులో పోలీసు కమిషనర్ల నియామకం వంటివి కూడా గవర్నర్‌ సలహాల మేరకు జరగాలన్నట్టు పేర్కొంది. దానిపై తెలంగాణ అభ్యంతరం తెల్పడంతో పక్కన పెట్టారు. దాన్ని ఉపసంహరించాలని ఆ ప్రభుత్వం గాని అమలు చేయాలని ఎపి ప్రభుత్వం గాని ఎప్పుడూ గట్టిగా అడిగింది లేదు. ఇప్పుడు రాజకీయ ఇరకాటంలో చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రులు దీన్ని పైకి తీశారు. తమ ప్రభుత్వాధినేతకే రక్షణ లేదు గనక స్వంత రాష్ట్ర పోలీసులను తెచ్చుకుంటామనీ, సరిగ్గా వారిపై ప్రతి వ్యూహ ప్రయోగం కోసం కెసిఆర్‌ ఆయన అనుయాయులు అసలా ఊసే ఒప్పుకోబోమని వాదించారు. 
చెప్పాలంటే ఇదంతా కృత్రిమమైన వ్యవహారం. పైగా ఈ క్రమంలో హైదరాబాదు శాంతిభద్రతలు పదే పదే చర్చకు రావడం రెండు రాష్ట్రాలకూ మంచిది కాదు. చంద్రబాబు నాయుడు ఢిల్లీలో సమర్పించిన ఒక పత్రంలో దాడులు జరుగుతున్నట్టు పేర్కొన్నారు. కొన్ని రకాలైన ఒత్తిళ్లు, అపార్థాలు ఉన్నా ప్రభుత్వ స్థాయిలో ఫిర్యాదు చేయాల్సినంత తీవ్ర పరిస్థితి హైదరాబాదులో లేదనేది వాస్తవం. 
ప్రధానంగా ఉద్యోగ కేంద్రాలలోనూ, అధికారుల బదలాయింపులోనూ, విద్యా సంస్థల పరీక్షలు, సీట్ల కేటాయింపులలోనూ, నీటి పంపిణీ లోనూ వివాదాలు వచ్చిన మాట, కొనసాగుతున్న మాట కాదనలేనిది. అయితే ఇందుకు బాధ్యత ప్రభుత్వాలది తప్ప ప్రజలది కాదు. వారి మధ్య ఘర్షణలు వచ్చిందీ లేదు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పారిశ్రామికవేత్తల సదస్సుకు ఆంధ్రప్రదేశ్‌ హేమా హేమీలంతా వచ్చారు. అమరావతి నిర్మాణంలో భాగం కోసం తెలంగాణకు చెందిన సంస్థలూ ఉవ్విళ్లూరుతున్నాయి. ఎటొచ్చి తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌ల రాజకీయ వైరమే పరిస్థితిని ఉద్రిక్తం చేసింది. 

గ్రేటర్‌ హైదరాబాదు ఎన్నికల కోణంలో ఉన్న టిఆర్‌ఎస్‌ కూడా అందుకు తగినట్టే స్పందించింది. సెక్షన్‌ 8ని గుర్తిస్తాము గాని దాన్ని అమలు చేయాల్సిన పరిస్థితులు లేవని తెలంగాణ సర్కారు అంటుంది. ఆ పరిస్థితులు ఉన్నాయా, లేదా అని నిర్ణయించు కోవలసింది గవర్నరే. ఇక ఎపి విషయానికి వస్తే ఈ సెక్షన్‌లో దాని ప్రస్తావనే లేదు. 
గవర్నర్‌ సంప్రదించాల్సింది తెలంగాణ సర్కారును తప్ప ఎపిని కాదు. కాకపోతే ఏమైనా ఫిర్యాదులు, విజ్ఞప్తులు ఉంటే స్వీకరించి నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది.
అతి సామాన్య ప్రజలకు ఈ వివరాలన్నీ తెలిసి వుండకపోవచ్చు. అయితే ఏవివాదంలోనైనా, ఏ కీలకాంశంలోనైనా ప్రజల ప్రయోజనాలు ఎంత, పార్టీల లాభమెంత అని బేరీజువేసుకునే ఇంగితజ్ఞానం వున్న తెలుగు మనిషీ వర్ధిల్లు !